ఇంటి నుంచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స!
- July 09, 2022
కొలంబో: శ్రీలంక ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చినవేళ ప్రజాందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దేశం వదిలి పారిపోయాడు. రాజపక్సే రాజీనామా చేయాలంటూ శ్రీలంకలో భారీగా ఆందోళనలు చేపట్టారు. రాజపక్సే ఇంటిని ఆందోళనకారులు భారీగా చుట్టుముట్టారు. జనానికి దొరికితే చంపేస్తారేమోననే భయంతో పరారయ్యాడు.రాజపక్సే పరారీని శ్రీలంక సైన్య ధ్రువీకరించింది.గొటబాయ రాజపక్స సురక్షితంగా అక్కడి నుంచి వెళ్లిపోయారని రక్షణశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు.
గతంలో కూడా అప్పటి ప్రధాని మహింద రాజపక్స ఇంటిని ఆందోళనకారులు ముట్టడించటం వల్ల ఆయన కూడా ఇలాగే పారిపోయారు. శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ఆయన సోదరుడు మహింద రాజపక్స కారణమని ప్రతిపక్షాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. విదేశీ మారక నిల్వలు అడుగంటడం వల్ల ఇంధనం, ఆహార ఉత్పత్తుల దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో ధరలు ఆకాశాన్నంటాయి. ఇంధన కొరత కారణంగా విద్యుత్తు కోతలు అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







