ఏపీ నుంచి వెళ్లిన యాత్రికుల కుటుంబాల్లో ఆందోళన
- July 10, 2022
అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన పలువురు భక్తుల ఆచూకీ ఇంకా తెలియాకపోవడం తో ఆయా కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతుంది. గల్లంతైన వారిలో ఐదుగురు యాత్రికులు, అందులో ఒకరు క్షేమంగా ఉన్నట్లు ఏపీభవన్ అధికారులు వెల్లడించారు. విజయవాడ కు చెందిన వినోద్ అశోక్ , రాజమహేంద్రవరం కు చెందిన గునిశెట్టి సుధ, తిరుపతి కి చెందిన మధు , గుంటూరు కు చెందిన ఝాన్సీలక్ష్మి , విజయనగరం వాసి నాగేంద్రకుమార్ గల్లంతవ్వగా వీరిలో నాగేంద్రకుమార్ క్షేమంగా ఉన్నారు.
విజయనగరంలోని తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడిన వానపల్లి నాగేంద్రకుమార్.. క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
గల్లంతైన వారి కోసం ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తోందని ఏపీ అధికారులు తెలిపారు. మిస్సింగ్ అయినవారి ఆధార్ నంబర్లు అడిగి తీసుకున్నారు. శ్రీనగర్లోని టెంపుల్ బోర్డ్, కమాండ్ కంట్రోల్ రూంతో నిత్యం టచ్లో ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కేంద్రంతో సమన్వయం చేస్తున్న ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ లభించిన మృతదేహాల్లో ఏపీకి చెందిన వారెవరూ లేరని అధికారులు స్పష్టం చేశారు. యాత్రికుల మొబైల్ నంబర్స్ పనిచేయకపోవడం, స్విచ్ ఆఫ్ కావడం వల్ల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









