కొవిడ్ నిబంధనల మధ్య ఈద్ను సెలబ్రేషన్స్
- July 11, 2022
ఖతార్: ఖతార్ లో నిన్న ఈద్ అల్ అదాను కోవిడ్-19 నిబంధనల మధ్య ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా 588 మస్జీదులు, ప్రార్థన మైదానాల్లో ప్రార్థనలు జరిపారు. అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ పౌరులు, నివాసితులతో పాటు మొత్తం అరబ్ ప్రపంచానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈద్ సెలవుదినాన్ని ఆస్వాదించడానికి ప్రజలు ఆసక్తి చూపారు. దేశవ్యాప్తంగా, వినోద ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, ఆతిథ్య సేవా కేంద్రాలు ప్రజల రాకతో కళకళలాడాయి. ఇటీవల కోవిడ్-19 కేసులు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో కొవిడ్ నిబంధనలను ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తిరిగి ప్రవేశపెట్టింది. ఈద్ను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, అర్హులందరూ బూస్టర్ షాట్లతో సహా టీకాలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం ద్వారా కొవిడ్-19 ముందు జాగ్రత్త చర్యలకు కట్టుబడి ఉండాలని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









