కొవిడ్ నిబంధనల మధ్య ఈద్ను సెలబ్రేషన్స్
- July 11, 2022
ఖతార్: ఖతార్ లో నిన్న ఈద్ అల్ అదాను కోవిడ్-19 నిబంధనల మధ్య ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా 588 మస్జీదులు, ప్రార్థన మైదానాల్లో ప్రార్థనలు జరిపారు. అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ పౌరులు, నివాసితులతో పాటు మొత్తం అరబ్ ప్రపంచానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈద్ సెలవుదినాన్ని ఆస్వాదించడానికి ప్రజలు ఆసక్తి చూపారు. దేశవ్యాప్తంగా, వినోద ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, ఆతిథ్య సేవా కేంద్రాలు ప్రజల రాకతో కళకళలాడాయి. ఇటీవల కోవిడ్-19 కేసులు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో కొవిడ్ నిబంధనలను ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తిరిగి ప్రవేశపెట్టింది. ఈద్ను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, అర్హులందరూ బూస్టర్ షాట్లతో సహా టీకాలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం ద్వారా కొవిడ్-19 ముందు జాగ్రత్త చర్యలకు కట్టుబడి ఉండాలని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







