100 శాతానికి పెరిగిన ప్రయాణికులు
- July 13, 2022
మస్కట్: ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి ఒమన్ లోని పలు విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికుల రద్దీ 100 శాతానికి పెరిగి రికార్డు నమోదు చేయడం జరిగింది.
అదే విధంగా వెళ్లిపోయే వారి రద్దీ సైతం 69 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు సుమారుగా 2,324,007 మంది విమానాశ్రయానికి పలు విధాలుగా వచ్చారు.
జాతీయ గణాంకాల సంస్థ (NCSI) ప్రకారం చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా ఈ సంవత్సరం ప్రాథమిక దశలోనే ఇంత మంది రావడం అనేది మొదటి సారి అని పేర్కొంది.
రానున్న రోజుల్లో ప్రయాణికుల రద్దీ మరింతగా పెరగబోతున్నట్లు అంచనా వేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ విమానాలు సైతం ఒమన్ వైపు ఎక్కువ రావడం జరుగుతుందని పేర్కొంది.
ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ ఒమన్ విమానాశ్రయాలు రాబోయే రోజుల్లో అత్యంత ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరింతగా అభివృద్ధి చేయాలనే తలంపుతో ఉన్నాయి.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..







