భారత్: 200 కోట్లకు చేరువలో కోవిడ్ వ్యాక్సినేషన్
- July 17, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కోవిడ్ వ్యాక్సినేషన్ మరో మైలురాయిని చేరుకోబోతుంది. త్వరలో 200 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తవబోతుంది. శనివారం నాటికి 199.71 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైంది. ఒకట్రెండు రోజుల్లో 200 కోట్ల మైలురాయి పూర్తవుతుంది. 12-14 ఏళ్ల వయసు కలిగిన వారిలో ఇప్పటివరకు 3.79 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ఇది. జనవరి 16, 2021న దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. ఫిబ్రవరి 2, 2021 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్కు వ్యాక్సినేషన్ అందించారు. అదే ఏడు మార్చి 1న సీనియర్ సిటిజన్స్కు, ఏప్రిల్ 1న 45 సంవత్సరాలు దాటిన వారికి, మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్ అందించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ అక్టోబర్ 21 న వంద కోట్ల మార్కు దాటింది. ఈ ఏడాది జనవరి 3న 15-18 ఏళ్లు కలిగిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. జనవరి 10 నుంచి బూస్టర్ డోసును ప్రారంభించారు.
అయితే, ఫ్రంట్లైన్ వర్కర్స్, సీనియర్ సిటిజన్స్కు మాత్రమే. మార్చి 16న 12-14 ఏళ్ల వయసు కలిగిన వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో భాగంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద అందరికీ బూస్టర్ డోసులు ఇవ్వాలని.. అది కూడా ఉచితంగా అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఉచిత బూస్టర్ డోసుల కార్యక్రమం ఈ నెల 15న ప్రారంభమైంది.
తాజా వార్తలు
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!









