భారత్: 200 కోట్లకు చేరువలో కోవిడ్ వ్యాక్సినేషన్
- July 17, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కోవిడ్ వ్యాక్సినేషన్ మరో మైలురాయిని చేరుకోబోతుంది. త్వరలో 200 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తవబోతుంది. శనివారం నాటికి 199.71 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైంది. ఒకట్రెండు రోజుల్లో 200 కోట్ల మైలురాయి పూర్తవుతుంది. 12-14 ఏళ్ల వయసు కలిగిన వారిలో ఇప్పటివరకు 3.79 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ఇది. జనవరి 16, 2021న దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. ఫిబ్రవరి 2, 2021 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్కు వ్యాక్సినేషన్ అందించారు. అదే ఏడు మార్చి 1న సీనియర్ సిటిజన్స్కు, ఏప్రిల్ 1న 45 సంవత్సరాలు దాటిన వారికి, మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్ అందించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ అక్టోబర్ 21 న వంద కోట్ల మార్కు దాటింది. ఈ ఏడాది జనవరి 3న 15-18 ఏళ్లు కలిగిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. జనవరి 10 నుంచి బూస్టర్ డోసును ప్రారంభించారు.
అయితే, ఫ్రంట్లైన్ వర్కర్స్, సీనియర్ సిటిజన్స్కు మాత్రమే. మార్చి 16న 12-14 ఏళ్ల వయసు కలిగిన వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో భాగంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద అందరికీ బూస్టర్ డోసులు ఇవ్వాలని.. అది కూడా ఉచితంగా అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఉచిత బూస్టర్ డోసుల కార్యక్రమం ఈ నెల 15న ప్రారంభమైంది.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







