నలుగురు చిన్నారులను రక్షించిన సీడీఏఏ బృందాలు

- July 18, 2022 , by Maagulf
నలుగురు చిన్నారులను రక్షించిన సీడీఏఏ బృందాలు

మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని అల్-అతైబా బీచ్‌లో సముద్రంలో కొట్టుకుపోయిన నలుగురు చిన్నారులను సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) బృందాలు రక్షించాయి. సీబ్ విలాయత్‌లోని అల్-అతైబా బీచ్‌లో నలుగురు పిల్లలు మునిగిపోయారనే సమాచారం అందడంతో మస్కట్ గవర్నరేట్‌లోని పౌర రక్షణ, అంబులెన్స్ విభాగం వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని సముద్రంలో మునిగిన పిల్లలను రక్షించినట్లు సీడీఏఏ వివరించింది. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, పర్యవేక్షించాలని కోరింది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈత కొట్టడానికి వారిని అనుమతించవద్దని సీడీఏఏ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com