బస్సును ట్రక్కు ఢీ : 18 మంది మృతి

- April 12, 2016 , by Maagulf
బస్సును ట్రక్కు ఢీ : 18 మంది మృతి

తూర్పు పైసలాబాద్‌ నగరంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సును ట్రక్కు ఢీకొనడంతో 18 మంది మృతి చెందారు. మరో 15 మందికిపైగా గాయపడ్డారు. క్షత గాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమం గా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. బస్సు 50 మంది ప్రయాణికులతో పైసలాబాద్‌ నుంచి సాధికబాద్‌ జిల్లా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com