కువైట్‌ను సందర్శించిన ఇండియన్ నేవల్ షిప్

- July 19, 2022 , by Maagulf
కువైట్‌ను సందర్శించిన ఇండియన్ నేవల్ షిప్

కువైట్: కువైట్ రాష్ట్రంలోని షువైఖ్ పోర్ట్ కి ఇండియన్ నేవల్ షిప్ (INS) TEG జూలై 18, 2022న చేరుకుంది. కువైట్ నావల్ ఫోర్స్ సీనియర్ అధికారులు, పోర్ట్ అధికారులు, ఎంబసీ, డిఫెన్స్ వింగ్ అధికారులు ఈ నౌకకు స్వాగతం పలికారు. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో పైరసీ వ్యతిరేక కార్యకలాపాలతో సహా అనేక మిషన్ల కోసం INS TEGని మోహరించారు. భారతదేశ సముద్ర భాగస్వామి దేశాలలో సముద్ర భద్రతను పర్యవేక్షించేందుకు.. ఇతర ప్రాంతీయ నౌకాదళాలతో కలిసి ఇది పనిచేస్తుంది. INS TEG కువైట్ సందర్శన ఇండియా, కువైట్ రాష్ట్రం మధ్య లోతైన బహుముఖ స్నేహపూర్వక సంబంధాలను, పెరుగుతున్న సహకారాన్ని బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా ఇరు దేశాల అధికారులు అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com