ట్రక్కును ఢీకొట్టిన బస్సు...25 మంది మృతి
- July 19, 2022
కైరో: ఈజిప్టులోని దక్షిణ ప్రావిన్స్ మిన్యాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 25 మంది దుర్మరణం చెందారు.మరో 35 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
కైరో రాజధానిని కలిపే హైవేపై మిన్యా ప్రావిన్స్లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మంగళవారం తెల్లవారు జామున ఢీకొట్టింది. మిన్యా ప్రావిన్స్లోని మలావి నగరంలో బస్సును ఢీకొట్టిన సమయంలో రోడ్డు పక్కన ట్రక్కుకు సంబంధించిన టైర్లు మారుస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అంబులెన్స్లో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
అయితే, ఈజిప్ట్లో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.రోడ్లు అధ్వాన్నంగా ఉండడం, ట్రాఫిక్ చట్టాలను సరిగా అమలు చేయపోకవడంతో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ ఏడాది జనవరిలో రెండు బస్సులు ఢీకొట్టుకున్నాయి.ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా. మరో 18 మంది గాయపడ్డారు.గతేడాది ఏప్రిల్ హైవేపై లారీని ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







