కోల్ ఇండియాలో ఉద్యోగాలు...
- July 20, 2022
కోల్ ఇండియా లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 1050 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనన్నారు. మైనింగ్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యనికేషన్ సిస్టం అండ్ ఈడీపీ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే మైనింగి విభాగంలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మైనింగ్ లో బీఈ,బీటెక్,బీఎస్సీ చేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి. సివిల్ కు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ లో 60 శాతం మార్కులతో బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ విభాగంలో బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సిస్టం అండ్ ఈడీపీ కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన వారు లేదా ఎంసీఏ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు పొంది ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయస్సు 30ఏళ్లలోపు ఉండాలి. సంబంధిత విభాగాల్లో గేట్ 2022 స్కోర్ కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు సాధించిన గేట్ స్కోర్ ఆధారంగానే ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 23న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జులై 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://www.coalindia.in/పరిశీలించగలరు.
తాజా వార్తలు
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి
- మలేషియాలో ఏపీ వాసి మృతి
- తెలంగాణ: రేపే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక
- పాక్ను చిత్తుగా ఓడించిన భారత్..
- తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!









