ప్రవాసుడికి రెండేళ్ల జైలు శిక్ష...
- July 21, 2022
కువైట్ సిటీ: కువైట్ క్రిమినల్ కోర్టు తాజాగా ఈజిప్ట్ దేశానికి చెందిన ఓ ప్రవాసుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు 5.40లక్షల కువైటీ దినార్లు అతడు పనిచేసిన సంస్థకు చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది.వివరాల్లోకి వెళ్తే.. ఈజిప్ట్కు చెందిన ప్రవాసుడు, ఫహహీల్ కోఆపరేటివ్ సోసైటీలో పని చేశాడు.ఆ సమయంలో భారీ అవకతవకలకు పాల్పడ్డాడు. అలా ఒకటికాదు రెండుకాదు ఏకంగా 5.40లక్షల కువైటీ దినార్ల సోసైటీ నిధులను స్వదేశంలోని అతని బ్యాంక్ ఖాతాకు మళ్లీంచాడు.అనంతరం కొన్ని రోజుల తర్వాత సోసైటీలో ఉద్యోగం మానేసి స్వదేశానికి చెక్కేశాడు.
ఈ క్రమంలో అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేయగా భారీ మొత్తంలో ఫ్రాడ్ జరిగినట్టు నిర్దారించారు. నకిలీ రసీదులతో ప్రవాసుడు పలు దఫాలలో ఏకంగా 5.40లక్షల దినార్లు తన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు తేల్చారు. అయితే, అప్పటికే అతగాడు స్వదేశానికి చెక్కేయడంతో సంస్థ యాజమాన్యం కువైత్ క్రిమినల్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ప్రవాసుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు అతడు సంస్థను మోసగించి తీసుకున్న 5.40లక్షల దినార్లు తిరిగి చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!
- విడాకుల కేసులు పెరగడంపై షురా కౌన్సిల్ ఆందోళన..!!
- అలెర్ట్..ఉమ్ అల్ హౌల్ ఇంటర్చేంజ్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఆన్లైన్ బెగ్గింగ్ మోసాలపై దుబాయ్ పోలీసుల వార్న్..!!
- రమదాన్..ధరల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు..!!
- కింగ్ ఫైసల్ రోడ్డులో రెండు లేన్లు మార్చి 29 వరకు మూసివేత..!!
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!









