ప్రవాసుడికి రెండేళ్ల జైలు శిక్ష...
- July 21, 2022
కువైట్ సిటీ: కువైట్ క్రిమినల్ కోర్టు తాజాగా ఈజిప్ట్ దేశానికి చెందిన ఓ ప్రవాసుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు 5.40లక్షల కువైటీ దినార్లు అతడు పనిచేసిన సంస్థకు చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది.వివరాల్లోకి వెళ్తే.. ఈజిప్ట్కు చెందిన ప్రవాసుడు, ఫహహీల్ కోఆపరేటివ్ సోసైటీలో పని చేశాడు.ఆ సమయంలో భారీ అవకతవకలకు పాల్పడ్డాడు. అలా ఒకటికాదు రెండుకాదు ఏకంగా 5.40లక్షల కువైటీ దినార్ల సోసైటీ నిధులను స్వదేశంలోని అతని బ్యాంక్ ఖాతాకు మళ్లీంచాడు.అనంతరం కొన్ని రోజుల తర్వాత సోసైటీలో ఉద్యోగం మానేసి స్వదేశానికి చెక్కేశాడు.
ఈ క్రమంలో అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేయగా భారీ మొత్తంలో ఫ్రాడ్ జరిగినట్టు నిర్దారించారు. నకిలీ రసీదులతో ప్రవాసుడు పలు దఫాలలో ఏకంగా 5.40లక్షల దినార్లు తన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు తేల్చారు. అయితే, అప్పటికే అతగాడు స్వదేశానికి చెక్కేయడంతో సంస్థ యాజమాన్యం కువైత్ క్రిమినల్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ప్రవాసుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు అతడు సంస్థను మోసగించి తీసుకున్న 5.40లక్షల దినార్లు తిరిగి చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







