మొన్న రామ్, ఇప్పుడు నిత్యామీనన్.!
- July 21, 2022
సెలబ్రిటీల పెళ్లి వార్తలంటే ఒకింత ఆసక్తి వుండడం సహజమే. కానీ ఈ మధ్య సోషల్ మీడియా ట్రెండ్ పెరిగాక, పుట్టిందంటే చాలు.. అదిగో పెరిగిపోయింది.. అనేయడం ట్రెండింగ్గా మారిపోయింది.
ఆసుప్రతిలో చేరితే, హార్ట్ ఎటాక్, ప్రేమలో పడితే పెళ్లి అయిపోయినట్లే.. ఇలాంటి ఫేక్ వార్తలతో ఊదరగొడుతున్నారు. కొందరు సెలబ్రిటీలయితే, ఈ ఫేక్ న్యూస్ చూసి, ఎంజాయ్ చేసి ఊరుకుంటారు. ఇంకొందరైతే రెస్సాండ్ అయ్యి స్ర్టాంగ్ కౌంటర్ ఇస్తుంటారు.
మొన్న రామ్కి అలాగే సోషల్ మీడియాలో పెళ్లి డేట్ ఫిక్స్ చేసేశారు. పెళ్లి కూతురు కూడా సోషల్ కోళ్లే డిసైడ్ చేసేశాయ్. తర్వాత రామ్ తూచ్ అనడంతో ఆ ఫేక్ వార్తలకు చెక్ పడింది.
ఇప్పుడేమో నిత్యా మీనన్.. ఈ ముద్దుగుమ్మకీ పెళ్లి ఫిక్స్ చేసేశారు. తూచ్.! అదంతా వుత్తదే.. అంటూ నిత్యామీనన్ కూడా తాజాగా ఆ వార్తల్ని ఖండించింది. అంతేకాదు, పెళ్లి, గిళ్లీలాంటి గుడ్ న్యూస్ ఏమైనా వుంటే, ముందుగా మీకు చెప్పే చేసుకుంటాలెండి.. కానీ, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు ప్లీజ్.! అని ఫ్యాన్స్కి విజ్ఞప్తి చేసింది నిత్యా మీనన్.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







