మొన్న రామ్, ఇప్పుడు నిత్యామీనన్.!
- July 21, 2022
సెలబ్రిటీల పెళ్లి వార్తలంటే ఒకింత ఆసక్తి వుండడం సహజమే. కానీ ఈ మధ్య సోషల్ మీడియా ట్రెండ్ పెరిగాక, పుట్టిందంటే చాలు.. అదిగో పెరిగిపోయింది.. అనేయడం ట్రెండింగ్గా మారిపోయింది.
ఆసుప్రతిలో చేరితే, హార్ట్ ఎటాక్, ప్రేమలో పడితే పెళ్లి అయిపోయినట్లే.. ఇలాంటి ఫేక్ వార్తలతో ఊదరగొడుతున్నారు. కొందరు సెలబ్రిటీలయితే, ఈ ఫేక్ న్యూస్ చూసి, ఎంజాయ్ చేసి ఊరుకుంటారు. ఇంకొందరైతే రెస్సాండ్ అయ్యి స్ర్టాంగ్ కౌంటర్ ఇస్తుంటారు.
మొన్న రామ్కి అలాగే సోషల్ మీడియాలో పెళ్లి డేట్ ఫిక్స్ చేసేశారు. పెళ్లి కూతురు కూడా సోషల్ కోళ్లే డిసైడ్ చేసేశాయ్. తర్వాత రామ్ తూచ్ అనడంతో ఆ ఫేక్ వార్తలకు చెక్ పడింది.
ఇప్పుడేమో నిత్యా మీనన్.. ఈ ముద్దుగుమ్మకీ పెళ్లి ఫిక్స్ చేసేశారు. తూచ్.! అదంతా వుత్తదే.. అంటూ నిత్యామీనన్ కూడా తాజాగా ఆ వార్తల్ని ఖండించింది. అంతేకాదు, పెళ్లి, గిళ్లీలాంటి గుడ్ న్యూస్ ఏమైనా వుంటే, ముందుగా మీకు చెప్పే చేసుకుంటాలెండి.. కానీ, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు ప్లీజ్.! అని ఫ్యాన్స్కి విజ్ఞప్తి చేసింది నిత్యా మీనన్.
తాజా వార్తలు
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!
- ఏక్ పెడ్ మా కే నామ్..కువైట్ లో మొక్కలు నాటిన భారత రాయబారి..!!
- అల్-సఫ్లియా సమీపంలో నౌకల వినియోగంపై సర్క్యులర్ జారీ..!!
- ఒమన్ కార్మిక చట్టం ప్రకారం ఓవర్టైమ్ కు ఉద్యోగి అంగీకారం తప్పనిసరా?
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం









