చంద్రబాబు పర్యటనలో అపశృతి..
- July 21, 2022
అమరావతి: వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు కు చేదు అనుభవం ఎదురైంది. రాజోలు మండలం సోంపల్లి దగ్గర బోటు దిగుతుండగా బరువు ఎక్కువై నీటిలో బోల్తా కొట్టింది. దీంతో బోటులో ఉన్న టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన మత్స్యకారులు.. అందర్నీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఈఘటనలో మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, దేవినేని ఉమా, ఉండి ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, కొందరు మీడియా ప్రతినిధులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. నదికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. లైఫ్జాకెట్ల సాయంతో నీటిలో పడిపోయిన వారిని సురక్షితంగా కాపాడారు. అందరూ ఒడ్డుకు చేరిన తర్వాత చంద్రబాబు రాజోలులంక బయల్దేరారు. ఈ ఘటన లో చంద్రబాబుకు ఏ ప్రమాదం జరగకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!
- ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు









