భారత్ కరోనా అప్డేట్
- July 22, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 21,880 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. దేశంలో హోం క్వారంటైన్లలో, ఆసుపత్రుల్లో ప్రస్తుతం కరోనాకు 1,49,482 మంది (0.34 శాతం) చికిత్స పొందుతున్నారని తెలిపింది. రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 21,219 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,31,71,653కు చేరిందని పేర్కొంది.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.42 శాతంగా ఉందని తెలిపింది. అలాగే, వారాంతపు పాజిటివిటీ రేటు 4.51 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో నిన్న 37,06,997 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్పటివరకు దేశంలో వినియోగించిన కరోనా డోసుల సంఖ్య మొత్తం 201.30 కోట్లకు చేరిందని తెలిపింది. వాటిలో 92.85 కోట్ల సెకండ్ డోసులు, 6.63 కోట్ల బూస్టర్ డోసులు ఉన్నాయని వివరించింది. గత 24 గంటల్లో 4,95,359 కరోనా పరీక్షలు చేశారని పేర్కొంది. దేశం మొత్తం ఇప్పటివరకు 87.16 కోట్ల కరోనా పరీక్షలు చేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది.
తాజా వార్తలు
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!









