భారత్ కరోనా అప్డేట్
- July 22, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 21,880 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. దేశంలో హోం క్వారంటైన్లలో, ఆసుపత్రుల్లో ప్రస్తుతం కరోనాకు 1,49,482 మంది (0.34 శాతం) చికిత్స పొందుతున్నారని తెలిపింది. రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 21,219 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,31,71,653కు చేరిందని పేర్కొంది.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.42 శాతంగా ఉందని తెలిపింది. అలాగే, వారాంతపు పాజిటివిటీ రేటు 4.51 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో నిన్న 37,06,997 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్పటివరకు దేశంలో వినియోగించిన కరోనా డోసుల సంఖ్య మొత్తం 201.30 కోట్లకు చేరిందని తెలిపింది. వాటిలో 92.85 కోట్ల సెకండ్ డోసులు, 6.63 కోట్ల బూస్టర్ డోసులు ఉన్నాయని వివరించింది. గత 24 గంటల్లో 4,95,359 కరోనా పరీక్షలు చేశారని పేర్కొంది. దేశం మొత్తం ఇప్పటివరకు 87.16 కోట్ల కరోనా పరీక్షలు చేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









