భారత్ కరోనా అప్డేట్
- July 22, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 21,880 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. దేశంలో హోం క్వారంటైన్లలో, ఆసుపత్రుల్లో ప్రస్తుతం కరోనాకు 1,49,482 మంది (0.34 శాతం) చికిత్స పొందుతున్నారని తెలిపింది. రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 21,219 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,31,71,653కు చేరిందని పేర్కొంది.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.42 శాతంగా ఉందని తెలిపింది. అలాగే, వారాంతపు పాజిటివిటీ రేటు 4.51 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో నిన్న 37,06,997 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్పటివరకు దేశంలో వినియోగించిన కరోనా డోసుల సంఖ్య మొత్తం 201.30 కోట్లకు చేరిందని తెలిపింది. వాటిలో 92.85 కోట్ల సెకండ్ డోసులు, 6.63 కోట్ల బూస్టర్ డోసులు ఉన్నాయని వివరించింది. గత 24 గంటల్లో 4,95,359 కరోనా పరీక్షలు చేశారని పేర్కొంది. దేశం మొత్తం ఇప్పటివరకు 87.16 కోట్ల కరోనా పరీక్షలు చేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







