భారత్లో మూడో మంకీపాక్స్ కేసు ..
- July 22, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో మూడో మంకీపాక్స్ కేసు నమోదైంది. కరోనా తీవ్రత పూర్తి స్థాయిలో ఇంకా తగ్గకముందే మరోమహమ్మారీ దేశంలోకి ప్రవేశించింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే రెండు మంకీపాక్స్ కేసులు కేరళలో నమోదు కాగా..తాజాగా మూడో కేసు సైతం కేరళలో వెలుగుచూసింది.
యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. సదరు వ్యక్తి జూలై 6న యూఏఈ నుంచి కేరళలోని మల్లాపురానికి తిరిగి వచ్చాడని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అతడు జ్వరంతో 13వ తేదీన మాంజెర్రీ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేరాడని ఆమె తెలిపారు. 15వ తేదీ నుంచి అతడిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యాయని వెల్లడించారు. 35 ఏళ్ల సదరు వ్యక్తి ప్రైమరీ కాంటాక్టులన్నీ ట్రేస్ చేశామని.. అందరినీ ఐసోలేషన్ ఉంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలో జులై 14న మంకీపాక్స్ తొలి కేసు నమోదైంది. అతడు కూడా యూఏఈ నుంచి వచ్చిన ప్రయాణికుడు కావడం గమనార్హం.
ఆ వ్యక్తి జులై 12న రాష్ట్రానికి చేరుకున్నాడని, త్రివేండ్రం విమానాశ్రయం నుంచి స్వస్థలానికి వచ్చారని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ తర్వాత కన్నూర్ జిల్లాలో రెండో కేసు నమోదైంది. కన్నూర్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్ బయటపడినట్లు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ వ్యక్తి జులై 13న దుబాయ్ నుంచి బయలుదేరి కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో దిగారు. ఆ తర్వాత లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేరారు. అతడి నమూనాలను ఎన్ఐవీ పుణేకు పంపించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇలా మొత్తం మూడు కేసులు కేరళలో బయటపడడం తో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అవుతుంది.
తాజా వార్తలు
- దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- తెలంగాణ: వచ్చే నెల నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీ..
- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో SANKALP పథక అమలు పై సమగ్ర సమీక్ష
- ఇక పై ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్
- హైదరాబాద్: మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం
- ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్..రాత్రికి విడుదల
- పరువు నష్టం కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
- ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి లోకేష్
- ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం..15 రోజుల డెడ్లైన్!
- పబ్లిక్ పాస్టింగ్ వయోలేషన్..జైలుశిక్ష లేదా BD100 ఫైన్..!!









