ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం..15 రోజుల డెడ్లైన్!
- February 20, 2026
అణు ఒప్పందం అంశంపై ఇరాన్– అమెరికా మధ్య తీవ్ర ఉదిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించారు. వాషింగ్టన్లో జరిగిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ సమావేశం, ఆ తర్వాత విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ విషయంలో తనలో సహనం నశించిందని స్పష్టం చేశారు. ఏదో ఒక ఒప్పందానికి రావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇరాన్కు అత్యంత దురదృష్టకరమైన పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారు. అణు ఒప్పందంపై నిర్ణయం తీసుకోవడానికి 10 నుంచి 15 రోజుల సమయం గరిష్టంగా సరిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ తన అణు మొండితనాన్ని వీడకపోతే, తాము సైనిక చర్య వేయక తప్పదని ఆయన పరోక్షంగా యుద్ధ సంకేతాలు ఇచ్చారు.
“మేము చేపట్టిన అణు నివారణ చర్యలను పూర్తి చేసే మార్గంలో ఇరాన్ మాతో చేతులు కలపాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ వారు మాతో కలిస్తే అది చాలా మంచిది. వారు మాతో కలవకపోయినా అది కూడా మంచిదే. కానీ, ఆ తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. ఒప్పందంపై ఎక్కువ రోజు సాగదీయలేం. ఇరాన్ కచ్చితంగా ఒప్పందానికి రావాలి. ఒకవేళ అలా జరగకపోతే, ఒప్పందం కుదరని పక్షంలో చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు మేము దీనిని మరో మెట్టు ముందుకు తీసుకెళ్లాల్సి రావచ్చు. బహుశా మేము ఒక ఒప్పందానికి రావచ్చు. రాబోయే 10 రోజుల్లో ఒప్పందంపై నిర్ణయం తెలుస్తుంది” అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









