విజిటర్ డబ్బులు చోరీ.. ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా
- July 23, 2022
దుబాయ్: ఒక ఆసియా విజిటర్ నుండి డబ్బులు అపహరించినందుకు దుబాయ్లోని కోర్ట్ ఆఫ్ మిస్డిమీనర్స్ ఇద్దరు ఆసియన్లకు ఒక్కొక్కరికి రెండు నెలల జైలు శిక్ష విధించింది. దాంతోపాటు సంయుక్తంగా Dhs 50,000 జరిమానా విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత దోషులు బహిష్కరించాలని ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత ఏప్రిల్లో నమోదైంది. ఒక ఆసియా విజిటర్ తన వద్ద ఉన్న 50,000 సౌదీ రియాల్స్ ను ఎమిరాటీ దిర్హామ్లుగా మార్చుకోవడానికి ఎమిరేట్స్ ID కార్డ్ లేనందున సహాయం చేయమని ఒక ఆసియా వ్యక్తిని కోరాడు. ఇద్దరూ నైఫ్ ప్రాంతంలోని ఒక ఎక్స్ఛేంజ్ ఆఫీసుకు వెళ్లారు. విజిటర్ నుండి 50,000 రియాల్స్ తీసుకొని.. ఎక్స్ఛేంజ్ ఆఫీస్ ఉద్యోగికి అందజేశారు. ఆ తర్వాత అతడిచ్చిన దిర్హామ్లను అందుకున్న నిందితుడు.. ఎక్స్ఛేంజ్ కార్యాలయం నుంచి పారిపోయాడు. దీంతో విజిటర్ పోలీసులను ఆశ్రయించాడు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









