విజిటర్ డబ్బులు చోరీ.. ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా
- July 23, 2022
దుబాయ్: ఒక ఆసియా విజిటర్ నుండి డబ్బులు అపహరించినందుకు దుబాయ్లోని కోర్ట్ ఆఫ్ మిస్డిమీనర్స్ ఇద్దరు ఆసియన్లకు ఒక్కొక్కరికి రెండు నెలల జైలు శిక్ష విధించింది. దాంతోపాటు సంయుక్తంగా Dhs 50,000 జరిమానా విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత దోషులు బహిష్కరించాలని ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత ఏప్రిల్లో నమోదైంది. ఒక ఆసియా విజిటర్ తన వద్ద ఉన్న 50,000 సౌదీ రియాల్స్ ను ఎమిరాటీ దిర్హామ్లుగా మార్చుకోవడానికి ఎమిరేట్స్ ID కార్డ్ లేనందున సహాయం చేయమని ఒక ఆసియా వ్యక్తిని కోరాడు. ఇద్దరూ నైఫ్ ప్రాంతంలోని ఒక ఎక్స్ఛేంజ్ ఆఫీసుకు వెళ్లారు. విజిటర్ నుండి 50,000 రియాల్స్ తీసుకొని.. ఎక్స్ఛేంజ్ ఆఫీస్ ఉద్యోగికి అందజేశారు. ఆ తర్వాత అతడిచ్చిన దిర్హామ్లను అందుకున్న నిందితుడు.. ఎక్స్ఛేంజ్ కార్యాలయం నుంచి పారిపోయాడు. దీంతో విజిటర్ పోలీసులను ఆశ్రయించాడు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







