విమానంలో అస్వస్థతకు గురైన వ్యక్తికి వైద్యం చేసిన టి.గవర్నర్ తమిళిసై
- July 23, 2022
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజకీయాల్లోకి రాకముందు డాక్టర్ అనే విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చాక తమిళిసై వైద్యవృత్తిని పక్కనపెట్టి గవర్నర్ గా బిజీ అయిపోయారు. ఈక్రమంలో ఆమె అనుకోకుండా డాక్టర్ గా మారారు. తమిళిసై ప్రయాణిస్తున్న విమానంలో ఓ వ్యక్తి హఠాత్తుగా అస్వస్థతకు గురి కాగా గవర్నర్ తమిళిసై డాక్టర్ గా మారి సదరు వ్యక్తికి వైద్యం చేశారు. తమిళిసై ప్రాథమిక చికిత్సతతో అనారోగ్యం నుంచి తేరుకున్న ఆ ప్రయాణికుడు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానంలో తమిళిసై ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురి అయ్యాడు. విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఇక్కడ డాక్టర్లు ఎవరైనా ఉన్నారా? అని అంటూ అనౌన్స్మెంట్ చేశారు. దీంతో అదే విమానంలో ప్రయాణిస్తున్న తమిళిసై వెంటనే స్పందించారు.. నేరుగా బాధితుడి వద్దకు వెళ్లిప్రాథమిక చికిత్స చేయగా అతను కాసేపటికి కోలుకున్నాడు. బాధితుడు కోలుకున్నాక… విమాన సిబ్బందికి ఆమె కొన్ని సూచనలు చేశారు. విమానం బయలుదేరే ముందే ప్రయాణికుల్లో డాక్టర్లు ఉన్నట్లైతే… ముందుగా చార్ట్లోనే విషయాన్ని తెలియజేయాలని ఆమె సూచించారు. అంతేకాకుండా కనీసం సీపీఆర్ చేసుకునేలా ప్రయాణికులకు అవగాహన కల్పించాలని కూడా ఆమె సూచించారు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







