నిషిద్ధ ప్రదేశాల్లో నిప్పంటించినందుకు SR3,000 జరిమానా
- July 24, 2022
రియాద్: తమకు కేటాయించిన ప్రదేశాలలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎవరైనా నిప్పు పెడితే జరిమానా విధిస్తామని పర్యావరణ భద్రత ప్రత్యేక దళాలు హెచ్చరించాయి. అడవులు లేదా జాతీయ ఉద్యానవనాలలో నిర్దేశించిన ప్రదేశాలలో కాకుండా ఇతర ప్రదేశాలలో మంటలు పెడితే SR 3,000 వరకు జరిమానా విధించనున్నట్లు స్పెషల్ ఫోర్సెస్ తెలిపాయి. మక్కా, రియాద్ ప్రాంతాలలో 911, సౌదీ అరేబియాలోని మిగిలిన ప్రాంతాలలో 999, 996 నంబరులో పర్యావరణం లేదా వన్యప్రాణులపై దాడి చేసే ఏవైనా కేసుల సమాచారం ఉంటే తమకు తెలిపి సహకరించాలని భద్రతా బలగాలు పిలుపునిచ్చాయి. తాజాగా పర్యావరణ కాలుష్యానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను జెడ్డాలో తమ ఇన్స్పెక్టర్లు అరెస్టు చేసినట్లు పర్యావరణ భద్రత కోసం ప్రత్యేక బలగాల అధికారులు ప్రకటించారు. . సూడాన్ జాతీయులు రాగిని సేకరించే ఉద్దేశ్యంతో పారిశ్రామిక వ్యర్థాలను కాల్చడం ద్వారా పర్యావరణాన్ని కలుషితం చేశారని, మట్టిని పాడు చేశారని స్పెషల్ ఫోర్సెస్ తెలిపింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







