వలసదారుల ఇంటి అద్దెలపై 3 శాతం పన్ను

- April 13, 2016 , by Maagulf
వలసదారుల ఇంటి అద్దెలపై 3 శాతం పన్ను


అఉబదాబీలో అద్దె ఇళ్ళకు సంబంధించి కొత్త ఫీజు అమలులోకి వచ్చింది. మార్చ్‌ నుంచి కనీసం మూడు శాతం అదనపు ఫీజును వసూలు చేయనున్నారు. అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌ మరియు డిప్యూటీ సుప్రీం కమాండర్‌ ఆఫ్‌ ది యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డిక్రీని ఈ మేరకు విడుదల చేశారు. అబుదాబీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరానికి మినిమమ్‌ 450 దిర్హామ్‌లు ఫీజును అదనంగా వసూలు చేస్తారు. ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో ఈ మొత్తాన్ని చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఇలా వసూలు చేసిన నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తారు. అయితే ఈ వసూలు కేవలం వలసదారులకే వర్తిస్తుంది. కొందరు ఈ పెంపుదలను వ్యతిరేకిస్తుండగా, మరికొందరు పెంపు ఎక్కువేమీ కాదని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com