భారత్ కరోనా అప్డేట్
- July 26, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 14,830 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మహమ్మారి నుంచి 18,159 మంది కోలుకున్నారు.మరో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,39,20,451కు చేరింది. ఇప్పటి వరకు 4,32,46,829 మంది బాధితులు కోలుకోగా.. వైరస్ కారణంగా 5,26,110 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,47,512 యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం తెలిపింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.34శాతం ఉన్నాయని, రికవరీ రేటు 98.47శాతంగా ఉందని పేర్కొంది. రోజువారి పాజిటివిటీ రేటు 3.84శాతం ఉందని, విక్లీ పాజిటివిటీ రేటు 4.53శాతం ఉందని చెప్పింది. గత 24గంటల్లో 4,26,102 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 87.37 కోట్ల టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. మరో వైపు దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. టీకా డ్రైవ్లో 202.5కోట్ల డోసులు వేసినట్లు వివరించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







