కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన 14 ఏళ్ల ఖతార్ బాలిక
- July 27, 2022
దోహా: దోహాలోని ఓరిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న అన్వీ అమిత్ జోషి(14).. ఇటీవల ఆఫ్రికాలోని ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఖతార్ నుండి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కులలో ఆమె ఒకరు. ఆమె 2021లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను కూడా చేరుకొని రికార్డు సృష్టించింది. "శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. చాలామందికి అసాధ్యమైన దీన్నినేను చిరునవ్వుతో.. ఆనందంతో అధిరోహించాను." అని అన్వీ తన ట్రెక్కింగ్ అనుభవాలను తెలిపింది. ఇప్పటి వరకు అన్వీ మూడు దేశాల్లో మొత్తం ఏడు ట్రెక్లను పూర్తి చేసింది. భారతదేశంలోని రూపిన్ పాస్, హేమకుండ్ సాహిబ్, కేదార్కాంతతో పాటు నేపాల్లోని మార్డి హిమాల్, అన్నపూర్ణ సర్క్యూట్/ థొరాంగ్ లా పాస్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్లను అధిరోహించింది. తన ఏడో ప్రయత్నంగా మౌంట్ కిలిమంజారోను జయించింది.

తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







