కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన 14 ఏళ్ల ఖతార్ బాలిక
- July 27, 2022
దోహా: దోహాలోని ఓరిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న అన్వీ అమిత్ జోషి(14).. ఇటీవల ఆఫ్రికాలోని ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఖతార్ నుండి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కులలో ఆమె ఒకరు. ఆమె 2021లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను కూడా చేరుకొని రికార్డు సృష్టించింది. "శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. చాలామందికి అసాధ్యమైన దీన్నినేను చిరునవ్వుతో.. ఆనందంతో అధిరోహించాను." అని అన్వీ తన ట్రెక్కింగ్ అనుభవాలను తెలిపింది. ఇప్పటి వరకు అన్వీ మూడు దేశాల్లో మొత్తం ఏడు ట్రెక్లను పూర్తి చేసింది. భారతదేశంలోని రూపిన్ పాస్, హేమకుండ్ సాహిబ్, కేదార్కాంతతో పాటు నేపాల్లోని మార్డి హిమాల్, అన్నపూర్ణ సర్క్యూట్/ థొరాంగ్ లా పాస్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్లను అధిరోహించింది. తన ఏడో ప్రయత్నంగా మౌంట్ కిలిమంజారోను జయించింది.

తాజా వార్తలు
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్పుర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!









