ప్రయాణీకుల కోసం 'డోర్-టు-డోర్ సర్వీస్: ఎతిహాద్ రైల్వే
- July 27, 2022
యూఏఈ: జాతీయ రైల్వే నెట్వర్క్ ప్రయాణికులు స్టేషన్ నుండి తమ చివరి గమ్యస్థానానికి అత్యంత సౌకర్యంగా చేరుకునేలా “డోర్-టు-డోర్” సర్వీస్ ప్రారంభించినట్లు ఎతిహాద్ రైల్కి చెందిన ఒక ఉన్నత అధికారి తెలిపారు. ఎతిహాద్ రైల్లోని ప్యాసింజర్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహ్మద్ అల్ ముసావా అల్ హషేమీ మాట్లాడుతూ.. రైల్వేలు అన్ని రకాల రవాణా, భాగస్వామ్య మొబిలిటీ సొల్యూషన్లతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రయాణీకుల చివరి గమ్యస్థానానికి చేరేందుకు ప్రజా రవాణా అందుబాటులో ఉంటుందన్నారు. అల్ రువైస్, అల్ మిర్ఫా, దుబాయ్, షార్జా, అల్ దైద్, అబుదాబితో సహా అల్ సిలా నుండి ఫుజైరా వరకు యూఏఈలోని 11 నగరాలు, ప్రాంతాలను ప్యాసింజర్ రైలు కలుపుతుందని అల్ హషేమీ చెప్పారు. ఒక్కో రైలులో 400 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంటుంది. గంటకు 200 కి.మీ వేగంతో ట్రైన్స్ ప్రయాణిస్తాయి. ప్రయాణికులు అబుదాబి నుంచి దుబాయ్కి 50 నిమిషాల్లో, రాజధాని నుంచి ఫుజైరాకు 100 నిమిషాల్లో చేరుకోవచ్చు. 2030 నాటికి రైల్ ప్రయాణీకుల సంఖ్య 36.5 మిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







