హీరోలను టార్గెట్ చేసిన కొరియోగ్రఫర్: అసలు అమ్మకి ఏమైంది.!
- July 27, 2022
డాన్స్ కొరియోగ్రఫర్గా మంచి పేరున్న అమ్మ రాజశేఖర్కి ఈ మధ్య ఏమైంది.? వరుస పెట్టి హీరోలను టార్గెట్ చేస్తున్నాడు. పబ్లిక్గా హీరోలపై నోరు పారేసుకుంటున్నాడు. ఆయా హీరోల పరువు తీసే పనిలో బిజీగా వున్నాడు.
కొరియోగ్రఫర్గా పేరు తెచ్చుకున్న అమ్మరాజశేఖర్, బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా పాపులారిటీతో పాటు ఒకింత నెగిటివిటీ కూడా పెంచుకున్నాడనే చెప్పాలేమో. ఇక, హౌస్ నుంచి బయటికి వచ్చాకా, ఆయన డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కించాడు. అదే, ‘హైఫై’. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా, ప్రమోషన్లు గట్టిగానే చేస్తున్నాడీ డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్.
ఈ నేపథ్యంలో మొన్న నితిన్పై నోరు పారేసుకున్నాడు. తన సినిమా ఈవెంట్కి వస్తానని చెప్పి రాలేదంటూ నితిన్పై అవాకులు చవాకులూ పేలాడు.
ఆ తర్వాత హీరో గోపీచంద్ని జుగుప్సాకరంగా ఆడి పోసుకున్నాడు. ఇప్పుడు మరో హీరో జేడీ చక్రవర్తి పరువు కూడా తీసేసే పనిలో పడ్డాడు. అప్పుడెప్పుడో ‘ఉగ్రం’ సినిమా టైమ్లో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, సినిమా మధ్యలో జేడీ చక్రవర్తి వేలు పెట్టి కెలికేస్తాడంటూ ఆయన పరువు కూడా తీసేశాడు.
దీంతో అమ్మ రాజశేఖర్కి ఏమైంది.? ఆయన తన సినిమాని ప్రమోట్ చేస్తున్నాడా.? లేక హీరోల పరువు తీసే పనిలో బిజీగా వున్నాడా.? అంటూ నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..