హీరోలను టార్గెట్ చేసిన కొరియోగ్రఫర్: అసలు అమ్మకి ఏమైంది.!

- July 27, 2022 , by Maagulf
హీరోలను టార్గెట్ చేసిన కొరియోగ్రఫర్: అసలు అమ్మకి ఏమైంది.!

డాన్స్ కొరియోగ్రఫర్‌గా మంచి పేరున్న అమ్మ రాజశేఖర్‌కి ఈ మధ్య ఏమైంది.? వరుస పెట్టి హీరోలను టార్గెట్ చేస్తున్నాడు. పబ్లిక్‌గా హీరోలపై నోరు పారేసుకుంటున్నాడు. ఆయా హీరోల పరువు తీసే పనిలో బిజీగా వున్నాడు.

కొరియోగ్రఫర్‌గా పేరు తెచ్చుకున్న అమ్మరాజశేఖర్, బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా పాపులారిటీతో పాటు ఒకింత నెగిటివిటీ కూడా పెంచుకున్నాడనే చెప్పాలేమో. ఇక, హౌస్ నుంచి బయటికి వచ్చాకా, ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కించాడు. అదే, ‘హైఫై’. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా, ప్రమోషన్లు గట్టిగానే చేస్తున్నాడీ డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్.

ఈ నేపథ్యంలో మొన్న నితిన్‌పై నోరు పారేసుకున్నాడు. తన సినిమా ఈవెంట్‌కి వస్తానని చెప్పి రాలేదంటూ నితిన్‌పై అవాకులు చవాకులూ పేలాడు. 

ఆ తర్వాత హీరో గోపీచంద్‌ని జుగుప్సాకరంగా ఆడి పోసుకున్నాడు. ఇప్పుడు మరో హీరో జేడీ చక్రవర్తి పరువు కూడా తీసేసే పనిలో పడ్డాడు. అప్పుడెప్పుడో ‘ఉగ్రం’ సినిమా టైమ్‌లో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, సినిమా మధ్యలో జేడీ చక్రవర్తి వేలు పెట్టి కెలికేస్తాడంటూ ఆయన పరువు కూడా తీసేశాడు. 

దీంతో అమ్మ రాజశేఖర్‌కి ఏమైంది.? ఆయన తన సినిమాని ప్రమోట్ చేస్తున్నాడా.? లేక హీరోల పరువు తీసే పనిలో బిజీగా వున్నాడా.? అంటూ నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com