హీరోలను టార్గెట్ చేసిన కొరియోగ్రఫర్: అసలు అమ్మకి ఏమైంది.!
- July 27, 2022
డాన్స్ కొరియోగ్రఫర్గా మంచి పేరున్న అమ్మ రాజశేఖర్కి ఈ మధ్య ఏమైంది.? వరుస పెట్టి హీరోలను టార్గెట్ చేస్తున్నాడు. పబ్లిక్గా హీరోలపై నోరు పారేసుకుంటున్నాడు. ఆయా హీరోల పరువు తీసే పనిలో బిజీగా వున్నాడు.
కొరియోగ్రఫర్గా పేరు తెచ్చుకున్న అమ్మరాజశేఖర్, బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా పాపులారిటీతో పాటు ఒకింత నెగిటివిటీ కూడా పెంచుకున్నాడనే చెప్పాలేమో. ఇక, హౌస్ నుంచి బయటికి వచ్చాకా, ఆయన డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కించాడు. అదే, ‘హైఫై’. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా, ప్రమోషన్లు గట్టిగానే చేస్తున్నాడీ డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్.
ఈ నేపథ్యంలో మొన్న నితిన్పై నోరు పారేసుకున్నాడు. తన సినిమా ఈవెంట్కి వస్తానని చెప్పి రాలేదంటూ నితిన్పై అవాకులు చవాకులూ పేలాడు.
ఆ తర్వాత హీరో గోపీచంద్ని జుగుప్సాకరంగా ఆడి పోసుకున్నాడు. ఇప్పుడు మరో హీరో జేడీ చక్రవర్తి పరువు కూడా తీసేసే పనిలో పడ్డాడు. అప్పుడెప్పుడో ‘ఉగ్రం’ సినిమా టైమ్లో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, సినిమా మధ్యలో జేడీ చక్రవర్తి వేలు పెట్టి కెలికేస్తాడంటూ ఆయన పరువు కూడా తీసేశాడు.
దీంతో అమ్మ రాజశేఖర్కి ఏమైంది.? ఆయన తన సినిమాని ప్రమోట్ చేస్తున్నాడా.? లేక హీరోల పరువు తీసే పనిలో బిజీగా వున్నాడా.? అంటూ నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









