రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్న కువైట్

- July 29, 2022 , by Maagulf
రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్న కువైట్

కువైట్ సిటీ: దేశవ్యాప్తంగా రక్త దాన కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించబోతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

వచ్చే మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యదృచ్ఛికంగా అదే రోజున కువైట్ పై ఇరాక్ అక్రమ చేసి 32 సంవత్సరాలు అవుతుంది. 

రక్త సంబంధిత సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ రీమ్ అల్ రద్వాన్ మాట్లాడుతూ రక్తదాన శిబిరాలు ఉదయం 8 నుండి సాయంత్రం 8 వరకు ఉంటాయి అని ప్రకటించారు. అంతేకాకుండా  దాతలను జబ్రీయా లోని కువైట్ కేంద్ర బ్లడ్ బ్యాంక్ రిసీవ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. 

పోయిన సంవత్సరం జరిగిన కార్యక్రమం ద్వారా 359 ప్యాకెట్ల రక్తం సమకూరింది. ఈ కార్యక్రమంలో మానవతా దృక్పథంతో పాల్గొని రక్తం దానం చేయాలని అధికారులు కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com