రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్న కువైట్
- July 29, 2022
కువైట్ సిటీ: దేశవ్యాప్తంగా రక్త దాన కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించబోతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
వచ్చే మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యదృచ్ఛికంగా అదే రోజున కువైట్ పై ఇరాక్ అక్రమ చేసి 32 సంవత్సరాలు అవుతుంది.
రక్త సంబంధిత సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ రీమ్ అల్ రద్వాన్ మాట్లాడుతూ రక్తదాన శిబిరాలు ఉదయం 8 నుండి సాయంత్రం 8 వరకు ఉంటాయి అని ప్రకటించారు. అంతేకాకుండా దాతలను జబ్రీయా లోని కువైట్ కేంద్ర బ్లడ్ బ్యాంక్ రిసీవ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.
పోయిన సంవత్సరం జరిగిన కార్యక్రమం ద్వారా 359 ప్యాకెట్ల రక్తం సమకూరింది. ఈ కార్యక్రమంలో మానవతా దృక్పథంతో పాల్గొని రక్తం దానం చేయాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







