రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్న కువైట్
- July 29, 2022
కువైట్ సిటీ: దేశవ్యాప్తంగా రక్త దాన కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించబోతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
వచ్చే మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యదృచ్ఛికంగా అదే రోజున కువైట్ పై ఇరాక్ అక్రమ చేసి 32 సంవత్సరాలు అవుతుంది.
రక్త సంబంధిత సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ రీమ్ అల్ రద్వాన్ మాట్లాడుతూ రక్తదాన శిబిరాలు ఉదయం 8 నుండి సాయంత్రం 8 వరకు ఉంటాయి అని ప్రకటించారు. అంతేకాకుండా దాతలను జబ్రీయా లోని కువైట్ కేంద్ర బ్లడ్ బ్యాంక్ రిసీవ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.
పోయిన సంవత్సరం జరిగిన కార్యక్రమం ద్వారా 359 ప్యాకెట్ల రక్తం సమకూరింది. ఈ కార్యక్రమంలో మానవతా దృక్పథంతో పాల్గొని రక్తం దానం చేయాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









