‘ప్రాజెక్ట్ కె’ గురించి నిర్మాత అశ్వనీదత్ ఎక్కువ చెబుతున్నారా.?
- July 29, 2022
ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాని భారీ బడ్జెట్తో వైజయంతీ మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
కాగా, ఈ సినిమా గురించి నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ, హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్’ రేంజ్లో వుండబోతోందట. తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లే సినిమా అవుతుందని చెబుతున్నారు.
షూటింగ్ కోసం కేవలం నాలుగు నెలలు మాత్రమే టైమ్ తీసుకుంటారట. కానీ, గ్రాఫిక్స్ వర్క్ చాలా టైమ్ పడుతుందట. ఆ టైమ్ దాదాపు 9 నెలలు అనీ తెలుస్తోంది. అందుకే 2024 సంవత్సరానికల్లా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు ఆయన తెలిపారు.
ఆల్రెడీ బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించుకున్న ప్రబాస్, ‘ప్రాజెక్ట్ కె’తో చైనా, అమెరికా మార్కెట్ని టార్గెట్ చేయబోతున్నాడట. అందుకే హాలీవుడ్ రేంజ్ మేకింగ్ వుండబోతోందట ఈ సినిమాలో. ఎక్కడా రాజీ పడేదేలే అంటున్నారు నిర్మాత అశ్వనీదత్.
ఎంత బడ్జెట్ అయినా వెనుకాడేదేలేదంటున్నారు. దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్న 2024 అక్టోబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







