‘ప్రాజెక్ట్ కె’ గురించి నిర్మాత అశ్వనీదత్ ఎక్కువ చెబుతున్నారా.?
- July 29, 2022
ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాని భారీ బడ్జెట్తో వైజయంతీ మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
కాగా, ఈ సినిమా గురించి నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ, హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్’ రేంజ్లో వుండబోతోందట. తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లే సినిమా అవుతుందని చెబుతున్నారు.
షూటింగ్ కోసం కేవలం నాలుగు నెలలు మాత్రమే టైమ్ తీసుకుంటారట. కానీ, గ్రాఫిక్స్ వర్క్ చాలా టైమ్ పడుతుందట. ఆ టైమ్ దాదాపు 9 నెలలు అనీ తెలుస్తోంది. అందుకే 2024 సంవత్సరానికల్లా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు ఆయన తెలిపారు.
ఆల్రెడీ బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించుకున్న ప్రబాస్, ‘ప్రాజెక్ట్ కె’తో చైనా, అమెరికా మార్కెట్ని టార్గెట్ చేయబోతున్నాడట. అందుకే హాలీవుడ్ రేంజ్ మేకింగ్ వుండబోతోందట ఈ సినిమాలో. ఎక్కడా రాజీ పడేదేలే అంటున్నారు నిర్మాత అశ్వనీదత్.
ఎంత బడ్జెట్ అయినా వెనుకాడేదేలేదంటున్నారు. దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్న 2024 అక్టోబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









