‘ప్రాజెక్ట్ కె’ గురించి నిర్మాత అశ్వనీదత్ ఎక్కువ చెబుతున్నారా.?
- July 29, 2022
ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాని భారీ బడ్జెట్తో వైజయంతీ మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
కాగా, ఈ సినిమా గురించి నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ, హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్’ రేంజ్లో వుండబోతోందట. తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లే సినిమా అవుతుందని చెబుతున్నారు.
షూటింగ్ కోసం కేవలం నాలుగు నెలలు మాత్రమే టైమ్ తీసుకుంటారట. కానీ, గ్రాఫిక్స్ వర్క్ చాలా టైమ్ పడుతుందట. ఆ టైమ్ దాదాపు 9 నెలలు అనీ తెలుస్తోంది. అందుకే 2024 సంవత్సరానికల్లా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు ఆయన తెలిపారు.
ఆల్రెడీ బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించుకున్న ప్రబాస్, ‘ప్రాజెక్ట్ కె’తో చైనా, అమెరికా మార్కెట్ని టార్గెట్ చేయబోతున్నాడట. అందుకే హాలీవుడ్ రేంజ్ మేకింగ్ వుండబోతోందట ఈ సినిమాలో. ఎక్కడా రాజీ పడేదేలే అంటున్నారు నిర్మాత అశ్వనీదత్.
ఎంత బడ్జెట్ అయినా వెనుకాడేదేలేదంటున్నారు. దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్న 2024 అక్టోబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







