యూఏఈ వరదల్లో ఏడుగురు ప్రవాసులు మృతి
- July 30, 2022
యూఏఈ: దేశంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదల్లో ఏడుగురు మరణించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన ఏడుగురు ఆసియా జాతీయులని, MOI ఫెడరల్ సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ అలీ సలేమ్ అల్-తునిజీ తెలిపారు. షార్జా, ఫుజైరా, రస్ అల్-ఖైమా నగరాలు వరలకు ఎక్కువగా ప్రభావితం అయ్యాయన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సహాయక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని, మంపు ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వివరించారు. వరదలకు గురైన వారిలో 80 శాతం మంది గత రెండు రోజుల్లో తమ నివాసాలకు తిరిగి వచ్చారని ఆయన తెలిపారు. ఫుజైరా, ఖోర్ ఫక్కన్లను కలిపే ప్రధాన రహదారి తెరిచే పనులు పూర్తి కావస్తున్నాయని అల్-తునిజీ తెలిపారు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!