యూఏఈ వరదల్లో ఏడుగురు ప్రవాసులు మృతి
- July 30, 2022
యూఏఈ: దేశంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదల్లో ఏడుగురు మరణించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన ఏడుగురు ఆసియా జాతీయులని, MOI ఫెడరల్ సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ అలీ సలేమ్ అల్-తునిజీ తెలిపారు. షార్జా, ఫుజైరా, రస్ అల్-ఖైమా నగరాలు వరలకు ఎక్కువగా ప్రభావితం అయ్యాయన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సహాయక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని, మంపు ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వివరించారు. వరదలకు గురైన వారిలో 80 శాతం మంది గత రెండు రోజుల్లో తమ నివాసాలకు తిరిగి వచ్చారని ఆయన తెలిపారు. ఫుజైరా, ఖోర్ ఫక్కన్లను కలిపే ప్రధాన రహదారి తెరిచే పనులు పూర్తి కావస్తున్నాయని అల్-తునిజీ తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







