డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ల వినియోగం.. 105,300 మందికి జరిమానా
- July 31, 2022
యూఏఈ: 2022 మొదటి ఆరు నెలల్లో అబుదాబి రోడ్లపై మొబైల్ ఫోన్లను ఉపయోగించినందుకు మొత్తం 105,300 మంది వాహనదారులకు జరిమానా విధించారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో డ్రైవర్లు ఫోన్లలో మాట్లాడటం లేదా మెసేజ్లు పంపడం, సోషల్ మీడియాలో చాట్ చేయడం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, ఫోటోలు తీయడం లేదా వీడియోలు తీయడం వంటివి చేస్తూ పట్టుబడ్డారని అబుదాబి పోలీస్లోని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ మేజర్ మహ్మద్ దహీ అల్ హుమిరి తెలిపారు. డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ను ఉపయోగిస్తే నాలుగు బ్లాక్ పాయింట్లతో పాటు 800 దిర్హామ్లు జరిమానా పడుతుందన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం చాలా మంది వాహనదారులకు ముఖ్యంగా యువతకు వ్యసనంగా మారిందని, ఇది రహదారి భద్రతకు చాలా పెద్ద ప్రమాదకరం అని అల్ హుమిరి అన్నారు. డ్రైవర్లు మొబైల్ ఫోన్లో మాట్లాడటం, సోషల్ నెట్వర్క్ సైట్లను బ్రౌజ్ చేయడం లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వీడియోలు తీసుకోవడం వంటి కారణాల వల్ల ఏకాగ్రత కోల్పోవడం, నిర్లక్ష్యం వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లను పట్టుకునేందుకు అబుదాబి రోడ్లపై స్మార్ట్ పెట్రోలింగ్ను ఏర్పాటు చేసినట్లు అబుదాబి పోలీసులు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







