మదీనాను సందర్శించిన 280,000 మంది యాత్రికులు

- August 01, 2022 , by Maagulf
మదీనాను సందర్శించిన 280,000 మంది యాత్రికులు

మదీనా: ఇప్పటివరకు మదీనాను 280,000 మంది యాత్రికులు సందర్శించారని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటి వరకు 280,554 మంది యాత్రికులు మదీనాకు చేరుకోగా.. 205,830 మంది యాత్రికులు నగరం నుండి బయలుదేరారని తెలిపింది. మదీనాలో ప్రస్తుతం 74,724 మంది యాత్రికులు ఉన్నారని పేర్కొంది. తాజాగా మదీనా ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 11,924 మంది యాత్రికులు బయలుదేరినట్లు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com