కొత్త సరకు ఓడ ఒమన్-కృష్ణపట్నం మధ్య...
- April 13, 2016
ఆంధ్రప్రదేశ్ (నెల్లూరు జిల్లా) లోని కృష్ణపట్నం పోర్టు నుంచి ఒమన్లోని సలాలాహ్ వరకూ కొత్త సరకు రవాణా సర్వీసు ప్రారంభం కానుంది. ఈ నెల 17 నుంచి ప్రతివారం ఒక సర్వీసును మీయర్స్క్ లైన్ ఇండియా ప్రారంభించనుందని కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, తూర్పు కర్ణాటక ప్రాంతాల్లోని వినియోగదార్లకు నేరుగా ఒమన్, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు సరకు రవాణా చేసేందుకు వీలుకలుగుతుందని పేర్కొంది. భారత తూర్పు తీరం నుంచి అతి తక్కువ సమయంలో శ్రీలంక, ఒమన్ చేరుకునే అవకాశం కూడా ఉంటుందని వివరించింది. సలాలాహ్ నుంచి బయలుదేరే ఈ షిప్పింగ్ సర్వీసు కొలంబో మీదుగా కృష్ణపట్నం పోర్టు చేరుకుంటుంది. అక్కడి నుంచి కట్టుపల్లి మీదగా సలాలాహ్ వెళ్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







