కొత్త సరకు ఓడ ఒమన్‌-కృష్ణపట్నం మధ్య...

- April 13, 2016 , by Maagulf
కొత్త సరకు ఓడ ఒమన్‌-కృష్ణపట్నం మధ్య...

 ఆంధ్రప్రదేశ్‌ (నెల్లూరు జిల్లా) లోని కృష్ణపట్నం పోర్టు నుంచి ఒమన్‌లోని సలాలాహ్‌ వరకూ కొత్త సరకు రవాణా సర్వీసు ప్రారంభం కానుంది. ఈ నెల 17 నుంచి ప్రతివారం ఒక సర్వీసును మీయర్‌స్క్‌ లైన్‌ ఇండియా ప్రారంభించనుందని కృష్ణపట్నం పోర్ట్‌ కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర తమిళనాడు, తూర్పు కర్ణాటక ప్రాంతాల్లోని వినియోగదార్లకు నేరుగా ఒమన్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు సరకు రవాణా చేసేందుకు వీలుకలుగుతుందని పేర్కొంది. భారత తూర్పు తీరం నుంచి అతి తక్కువ సమయంలో శ్రీలంక, ఒమన్‌ చేరుకునే అవకాశం కూడా ఉంటుందని వివరించింది. సలాలాహ్‌ నుంచి బయలుదేరే ఈ షిప్పింగ్‌ సర్వీసు కొలంబో మీదుగా కృష్ణపట్నం పోర్టు చేరుకుంటుంది. అక్కడి నుంచి కట్టుపల్లి మీదగా సలాలాహ్‌ వెళ్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com