వైసీపీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ..
- April 13, 2016
డా.బిఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని వైసీపీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైసీపీ నేతలు అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్... అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం అంబేడ్కర్ పాటుపడ్డారని కొనియాడారు. అంబేడ్కర్ సూచనలను పాలకులు పాటించాలన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్కు నిధులు కేటాయించాలన్నారు. క్రిస్టియన్లో చేరిన ఎస్సీలకు కులసర్టిఫికెట్ ఇవ్వడం లేదని, ఎస్సీ,ఎస్టీల హక్కులను ఏపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







