ఆగస్టు 5-15 వరకు అన్ని మ్యూజియాలు, పర్యాటక ప్రాంతాల్లో ప్రవేశం ఉచితం
- August 03, 2022
న్యూ ఢిల్లీ: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని మ్యూజియాలు, పర్యాటక ప్రాంతాల్లో 10 రోజులపాటు ఉచిత ప్రవేశం కల్పించారు. ఈ మేరకు ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న అన్ని మ్యూజియాలు, ఇతర పర్యాటక ప్రాంతాల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
స్వదేశీయులతో పాటు విదేశీయుల నుంచి ఎలాంటి ప్రవేశ రుసుము వసూలు చేయబోమని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మ్యూజియాలు, ఇతర పర్యాటక ప్రాంతాల్లోనూ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.గోల్కొండ, చార్మినార్తో పాటు ఇతర సందర్శన ప్రదేశాలను పర్యాటకులు ఉచితంగా చూడవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







