షూటింగులు బంద్: మాట మార్చేసిన దిల్ రాజు
- August 03, 2022
అందితే జుట్టు, లేకపోతే కాళ్లు పట్టుకునే చందంగా మారిపోయింది సినీ పరిశ్రమ పరిస్థితి. ముఖ్యంగా టాలీవుడ్ పరిస్థితి. ఇప్పుడెందుకీ చర్చ అంటారా.? అవును మరి, నిన్నేమో నిర్మాతలు డిమాండ్లు.. అదేనండీ సమస్యలు తీరే వరకూ షూటింగులు బంద్ చేసుకుంటున్నాం అని ప్రకటించిన మహానుభావులే తమ సినిమాల షూటింగులు ఆపుకోలేకపోయారు.
ఏంటిది అధ్యక్షా.! అని ప్రశ్నిస్తే, అది తెలుగు సినిమా కాదంటూ ప్లేట్ ఫిరాయించేస్తున్నారు. తమిళ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘వారసుడు’. ఇంతవరకూ తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు తెరపై సందడి చేసిన విజయ్, ఈ సినిమాతోనే స్ర్టెయిట్గా టాలీవుడ్కి పరిచయమవుతున్నాడు.. అంటూ ఇంతవరకూ ప్రచారం ఊదరగొట్టిన సంగతి తెలిసిందే.
దిల్ రాజు బ్యానర్లో మన తెలుగు దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు నేలపైనే వైజాగ్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, తాజాగా లేవనెత్తబడిన నిర్మాతల సమస్యలు, షూటింగ్స్ బంద్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా ఇప్పుడు తెలుగు సినిమా కాదట. సడెన్గా తమిళ సినిమా అయిపోయిందట.
తమిళ సినిమాని తెలుగులో డబ్ చేసుకుంటున్నారట. అదీ దిల్ రాజు వర్గం చెబుతున్న మాట. తనకైతే ఓ న్యాయం. పరులకు మరో న్యాయం.. అంటే ఇదే కదా. ఈ సినిమా షూటింగ్ ఆగిపోకూడనే రాజా వారి వర్గం ఇలా ప్లేట్ ఫిరాయించేశారు మరి.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







