షూటింగులు బంద్: మాట మార్చేసిన దిల్ రాజు
- August 03, 2022అందితే జుట్టు, లేకపోతే కాళ్లు పట్టుకునే చందంగా మారిపోయింది సినీ పరిశ్రమ పరిస్థితి. ముఖ్యంగా టాలీవుడ్ పరిస్థితి. ఇప్పుడెందుకీ చర్చ అంటారా.? అవును మరి, నిన్నేమో నిర్మాతలు డిమాండ్లు.. అదేనండీ సమస్యలు తీరే వరకూ షూటింగులు బంద్ చేసుకుంటున్నాం అని ప్రకటించిన మహానుభావులే తమ సినిమాల షూటింగులు ఆపుకోలేకపోయారు.
ఏంటిది అధ్యక్షా.! అని ప్రశ్నిస్తే, అది తెలుగు సినిమా కాదంటూ ప్లేట్ ఫిరాయించేస్తున్నారు. తమిళ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘వారసుడు’. ఇంతవరకూ తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు తెరపై సందడి చేసిన విజయ్, ఈ సినిమాతోనే స్ర్టెయిట్గా టాలీవుడ్కి పరిచయమవుతున్నాడు.. అంటూ ఇంతవరకూ ప్రచారం ఊదరగొట్టిన సంగతి తెలిసిందే.
దిల్ రాజు బ్యానర్లో మన తెలుగు దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు నేలపైనే వైజాగ్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, తాజాగా లేవనెత్తబడిన నిర్మాతల సమస్యలు, షూటింగ్స్ బంద్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా ఇప్పుడు తెలుగు సినిమా కాదట. సడెన్గా తమిళ సినిమా అయిపోయిందట.
తమిళ సినిమాని తెలుగులో డబ్ చేసుకుంటున్నారట. అదీ దిల్ రాజు వర్గం చెబుతున్న మాట. తనకైతే ఓ న్యాయం. పరులకు మరో న్యాయం.. అంటే ఇదే కదా. ఈ సినిమా షూటింగ్ ఆగిపోకూడనే రాజా వారి వర్గం ఇలా ప్లేట్ ఫిరాయించేశారు మరి.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..