ఈ నెల 18న టీటీడీ వాచీల ఈ-వేలం
- August 03, 2022
తిరుమల: టీటీడీ సంస్థ ఈ నెల 18న వాచీల ఈ-వేలం నిర్వహించనుంది.తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు, ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఈ-వేలంలో అందుబాటులో ఉంచుతారు. రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా 18న ఈ-వేలం నిర్వహించనున్నామని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ ప్రజా సంబంధాల అధికారి తెలిపారు.
ఇందులో సీకో, హెచ్ఎమ్టీ, టైటాన్, సోని, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్వెల్, ఫాస్ట్ట్రాక్, సిటిజన్, రొలెక్స్తోపాటు ఇతర కంపెనీల వాచీలను వేలంలో అందుబాటులో ఉంచుతారు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా పాడైన వాచీలు.. ఇలా వివిధ కేటగిరీలుగా, మొత్తం 22 లాట్ల వాచీలు ఈ-వేలంలో ఉంటాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నెంబరులో, కార్యాలయం వేళల్లో సంప్రదించవచ్చు. అలాగే టీటీడీ వెబ్సైట్ http://www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ http://www.konugolu.ap.gov.inను సంప్రదించగలరు.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









