భారత్లో తొమ్మిదో మంకీపాక్స్ కేసు నమోదు
- August 03, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో బుధవారం మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఉంటున్న నైజీరియాకు చెందిన 31 ఏళ్ల మహిళకు మంకీపాక్స్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఢిల్లీలోని నాలుగో కేసు కాగా.. దేశంలో తొమ్మిదో మంకీపాక్స్ కేసు. దేశంలో ఒక మహిళకు మంకీపాక్స్ సోకడం ఇదే మొదటిసారి.
ఆమెకు జ్వరం, చర్మంపై దద్దుర్లు, మెడ గ్రంథుల వద్ద వాపు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో స్థానిక ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మంకీపాక్స్ సోకినట్లు తెలిపారు. అయితే, ఆమె ఎక్కడెక్కడ పర్యటించిందో ఇంకా సమాచారం లేదు. మరోవైపు దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం, మంకీపాక్స్ లక్షణాలతో ఇటీవల ఒక రోగి మరణించడంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకీపాక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ కొన్ని సూచనలు చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల ప్రకారం.. వైరస్ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. రోగి తాకిన ప్రదేశాలను, వస్తువులను తాకకూడదు.
రోగికి దగ్గరగా ఉండే వాళ్లు శానిటైజర్, హ్యాండ్ వాష్, గ్లోవ్స్, మాస్క్ వంటివి వాడాలి. రోగి ఉపయోగించిన లాండ్రీ, బెడ్షీట్స్, టవల్స్ వంటివి వాడకూడదు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే పబ్లిక్ ప్లేసులకు వెళ్లకూడదు. ఈ వ్యాధి గురించి జరిగే అసత్య ప్రచారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







