భారత్లో తొమ్మిదో మంకీపాక్స్ కేసు నమోదు
- August 03, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో బుధవారం మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఉంటున్న నైజీరియాకు చెందిన 31 ఏళ్ల మహిళకు మంకీపాక్స్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఢిల్లీలోని నాలుగో కేసు కాగా.. దేశంలో తొమ్మిదో మంకీపాక్స్ కేసు. దేశంలో ఒక మహిళకు మంకీపాక్స్ సోకడం ఇదే మొదటిసారి.
ఆమెకు జ్వరం, చర్మంపై దద్దుర్లు, మెడ గ్రంథుల వద్ద వాపు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో స్థానిక ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మంకీపాక్స్ సోకినట్లు తెలిపారు. అయితే, ఆమె ఎక్కడెక్కడ పర్యటించిందో ఇంకా సమాచారం లేదు. మరోవైపు దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం, మంకీపాక్స్ లక్షణాలతో ఇటీవల ఒక రోగి మరణించడంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకీపాక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ కొన్ని సూచనలు చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల ప్రకారం.. వైరస్ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. రోగి తాకిన ప్రదేశాలను, వస్తువులను తాకకూడదు.
రోగికి దగ్గరగా ఉండే వాళ్లు శానిటైజర్, హ్యాండ్ వాష్, గ్లోవ్స్, మాస్క్ వంటివి వాడాలి. రోగి ఉపయోగించిన లాండ్రీ, బెడ్షీట్స్, టవల్స్ వంటివి వాడకూడదు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే పబ్లిక్ ప్లేసులకు వెళ్లకూడదు. ఈ వ్యాధి గురించి జరిగే అసత్య ప్రచారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









