భార‌త్‌ కరోనా అప్డేట్

- August 04, 2022 , by Maagulf
భార‌త్‌ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో కరోనా కేసులు ఉద్ధృతి కొనసాగుతుంది. బుధవారం 17,135 కేసులు నమోదవగా, కొత్తగా 19,893 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,40,87,037కు పెరిగింది. ఇందులో 4,34,24,029 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,530 మంది మృతిచెందారు. మరో 1,36,478 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 53 మంది కరోనాకు బలవగా, 20,419 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.3 శాతానికి చేరిందని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొన్నది. రికవరీ రేటు 98.50 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు 205.22 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com