తెలంగాణ లో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు
- August 04, 2022
హైదరాబాద్: ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. దీంతో పాటు మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రజలకు విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది.
అయితే.. తాజాగా.. తెలంగాణలో కరోనా వ్యాప్తి పెరుగుతూ, తగ్గుతూ సాగుతోంది. బుధవారం రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య 992గా నమోదైంది. గడచిన 24 గంటల్లో 41, 182 కరోనా పరీక్షలు నిర్వహించగా 992 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అత్యధికంగా హైదరాబాదులో 376 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 65, కరీంనగర్ జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 54, నల్గొండ జిల్లాలో 37 కేసులు గుర్తించారు. ఇంకా 842 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. అదే సమయంలో 852 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,22,663 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,12,420 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 6,132 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









