తెలంగాణ లో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు
- August 04, 2022
హైదరాబాద్: ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. దీంతో పాటు మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రజలకు విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది.
అయితే.. తాజాగా.. తెలంగాణలో కరోనా వ్యాప్తి పెరుగుతూ, తగ్గుతూ సాగుతోంది. బుధవారం రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య 992గా నమోదైంది. గడచిన 24 గంటల్లో 41, 182 కరోనా పరీక్షలు నిర్వహించగా 992 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అత్యధికంగా హైదరాబాదులో 376 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 65, కరీంనగర్ జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 54, నల్గొండ జిల్లాలో 37 కేసులు గుర్తించారు. ఇంకా 842 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. అదే సమయంలో 852 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,22,663 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,12,420 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 6,132 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







