దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో జాక్పాట్ కొట్టిన భారతీయుడు
- August 04, 2022
దుబాయ్: దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో కోశి వర్గీస్ (48) అనే భారత ప్రవాసుడు ఏకంగా 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు.బుధవారం దుబాయ్ ఇంటర్నెషనల్ విమానాశ్రయంలో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో కోశి విజేతగా నిలిచాడు. కొన్ని వారాల క్రితం అతడు కొనుగోలు చేసిన మిలీనియం మిలియనీర్ సిరీస్ నం.396, లాటరీ టికెట్ నం.0844కు ఈ జాక్పాట్ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే కోశి బ్యాంక్ ఖాతాలోకి రూ.7.9కోట్లు వచ్చిపడ్డాయి. దుబాయ్లో నివాసముండే 48 ఏళ్ల కోశి చాలా కాలంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో పాల్గొంటున్నాడు.చాలా ఏళ్లుగా క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఇటీవల స్వస్థలం కొచ్చిన్ నుంచి దుబాయ్ వస్తున్న సమయంలో ఇలాగే లాటరీ టికెట్ కొన్నాడు. అదే లాటరీ టికెట్ కోశికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది.
"నేను కొన్ని సంవత్సరాలుగా నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను.చివరకు నాకు అదృష్టం వరించింది. ఇంత భారీ మొత్తం గెలిచినందుకు ఆనందంగా ఉంది.ఇది జరిగేలా చేసిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ టీమ్ని చూడటానికి ఎదురు చూస్తున్నాను" అని కోశి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ నిర్వాహకులకు అతడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు. ఇక 1999లో మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు $1 మిలియన్ గెలుచుకున్న భారతీయ జాతీయులలో వర్గీస్ 195వ వ్యక్తి. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ టిక్కెట్ కొనుగోలుదారులలో అత్యధిక సంఖ్యలో భారతీయులే ఉంటున్నారని ఈ సందర్భంగా ర్యాఫిల్ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!







