ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: యూఎస్ వార్నింగ్

- August 04, 2022 , by Maagulf
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: యూఎస్ వార్నింగ్

అమెరికా: ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత అల్‌జవహరిని అమెరికా బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో అమెరికా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అగ్రరాజ్యం హెచ్చరికలు జారీ చేసింది. ‘‘అల్‌జవహరి మరణం నేపథ్యంలో.. అల్‌ఖైదా మద్దతుదారులు అమెరికా కార్యాలయాలు, అధికారులు, పౌరులపై దాడులు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. విదేశాలకు ప్రయాణాలు చేసే సమయంలో పరిస్థితులను గమనిస్తూ ఉండండి’’ అని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com