తెలంగాణ కరోనా అప్డేట్
- August 05, 2022హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40వేల 663 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 984 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 365 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 57 కేసులు, నల్గొండ జిల్లాలో 41 కేసులు, కరీంనగర్ జిల్లాలో 37 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22 కేసులు గుర్తించారు.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 923 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 24వేల 708 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 14వేల 179 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6వేల 418గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 43వేల 318 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1061 మందికి పాజిటివ్ గా తేలింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ