గాజాపై ఇజ్రాయెల్ దాడులు..8 మంది మృతి
- August 05, 2022
గాజా సిటీ: గాజా పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఎనిమిది మంది మరణించారు.మరో 40 మంది గాయపడ్డారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు.మృతుల్లో ఒక ఐదేళ్ల చిన్నారితోపాటు, ఒక తీవ్రవాది కూడా ఉన్నట్లు సమాచారం.
శుక్రవారం ఈ దాడులు ప్రారంభించినట్లు, గాజా స్ట్రిప్ ప్రాంతంలో ప్రత్యేక ఉద్రిక్త పరిస్థితి ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని హమాస్కు చెందిన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. నిర్దేశిత లక్ష్యాలపైకి ఇజ్రాయెల్ రాకెట్ లాంఛర్లు ప్రయోగించింది. గాజాలోని ఒక భవనం లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. భవనం ఏడో అంతస్థుపైన రాకెట్లు దాడి చేశాయి. ఈ దాడిలో ఎనిమిది మంది మరణించారు. గాజాలో దాదాపు ఇరవై లక్షల మంది నివసిస్తున్నారు. అయితే, ఇక్కడి తీవ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడుతున్నాయి.
దీంతో ఇజ్రాయెల్ తరచూ తీవ్రవాద స్థావరాలపై దాడులు చేస్తోంది.సరిహద్దుకు 80 కిలోమీటర్ల దూరంలోనే ఈ దాడులు జరిగాయి.ఇక్కడ ముందు జాగ్రత్తగా స్కూళ్లను మూసేసినట్లు అధికారులు తెలిపారు.గాజాకు వెళ్లే దారుల్ని ఇటీవలే ఇజ్రాయెల్ మూసేసింది.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









