గాజాపై ఇజ్రాయెల్ దాడులు..8 మంది మృతి
- August 05, 2022గాజా సిటీ: గాజా పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఎనిమిది మంది మరణించారు.మరో 40 మంది గాయపడ్డారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు.మృతుల్లో ఒక ఐదేళ్ల చిన్నారితోపాటు, ఒక తీవ్రవాది కూడా ఉన్నట్లు సమాచారం.
శుక్రవారం ఈ దాడులు ప్రారంభించినట్లు, గాజా స్ట్రిప్ ప్రాంతంలో ప్రత్యేక ఉద్రిక్త పరిస్థితి ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని హమాస్కు చెందిన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. నిర్దేశిత లక్ష్యాలపైకి ఇజ్రాయెల్ రాకెట్ లాంఛర్లు ప్రయోగించింది. గాజాలోని ఒక భవనం లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. భవనం ఏడో అంతస్థుపైన రాకెట్లు దాడి చేశాయి. ఈ దాడిలో ఎనిమిది మంది మరణించారు. గాజాలో దాదాపు ఇరవై లక్షల మంది నివసిస్తున్నారు. అయితే, ఇక్కడి తీవ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడుతున్నాయి.
దీంతో ఇజ్రాయెల్ తరచూ తీవ్రవాద స్థావరాలపై దాడులు చేస్తోంది.సరిహద్దుకు 80 కిలోమీటర్ల దూరంలోనే ఈ దాడులు జరిగాయి.ఇక్కడ ముందు జాగ్రత్తగా స్కూళ్లను మూసేసినట్లు అధికారులు తెలిపారు.గాజాకు వెళ్లే దారుల్ని ఇటీవలే ఇజ్రాయెల్ మూసేసింది.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్