ఖతార్ లో 13,430 హెక్టార్లకు చేరుకున్న సాగు భూమి
- August 06, 2022
ఖతార్: ఖతార్ సాగు భూమి 13,430 హెక్టార్లకు చేరుకుంది. 2021లో 772,829 టన్నుల పండ్లు, కూరగాయలు, ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది. ఈ మేరకు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖలోని వ్యవసాయ వ్యవహారాల విభాగం తన సోషల్ మీడియాలో తెలిపింది. 2,766 హెక్టార్లలో సాగు చేయబడిన కూరగాయల ఉత్పత్తి 2021 నాటికి 101,882 టన్నులకు చేరుకుందని పేర్కొంది. 2,703 హెక్టార్లలో 29,933 టన్నుల పండ్లను ఉత్పత్తి చేశారు. దీంతోపాటు 394 హెక్టార్లలో 3,305 టన్నుల ధాన్యాన్ని సాగు చేశారు. అలాగే 2021లో 7,566 హెక్టార్లలో 637,706 టన్నుల పశుగ్రాసాలను ఉత్పత్తి చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములు పెరుగుతున్నాయని, వ్యవసాయ ఉత్పత్తి ఖతార్ జాతీయ ఆహార భద్రతా వ్యూహం 2018-2023 విజయాన్ని తెలుపుతోందని వ్యవసాయ విభాగం పేర్కొంది. టేబుల్ గుడ్ల ఉత్పత్తిని 70 శాతానికి, చేపలను 90 శాతానికి, రొయ్యలను 100 శాతానికి, రెడ్ మీట్ ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- విజిట్ ఖతార్..అల్ రువైస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్..!!
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్









