ఖతార్ లో 13,430 హెక్టార్లకు చేరుకున్న సాగు భూమి
- August 06, 2022ఖతార్: ఖతార్ సాగు భూమి 13,430 హెక్టార్లకు చేరుకుంది. 2021లో 772,829 టన్నుల పండ్లు, కూరగాయలు, ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది. ఈ మేరకు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖలోని వ్యవసాయ వ్యవహారాల విభాగం తన సోషల్ మీడియాలో తెలిపింది. 2,766 హెక్టార్లలో సాగు చేయబడిన కూరగాయల ఉత్పత్తి 2021 నాటికి 101,882 టన్నులకు చేరుకుందని పేర్కొంది. 2,703 హెక్టార్లలో 29,933 టన్నుల పండ్లను ఉత్పత్తి చేశారు. దీంతోపాటు 394 హెక్టార్లలో 3,305 టన్నుల ధాన్యాన్ని సాగు చేశారు. అలాగే 2021లో 7,566 హెక్టార్లలో 637,706 టన్నుల పశుగ్రాసాలను ఉత్పత్తి చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములు పెరుగుతున్నాయని, వ్యవసాయ ఉత్పత్తి ఖతార్ జాతీయ ఆహార భద్రతా వ్యూహం 2018-2023 విజయాన్ని తెలుపుతోందని వ్యవసాయ విభాగం పేర్కొంది. టేబుల్ గుడ్ల ఉత్పత్తిని 70 శాతానికి, చేపలను 90 శాతానికి, రొయ్యలను 100 శాతానికి, రెడ్ మీట్ ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA