రాగల 24-48 గంటల్లో తెలంగాణ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- August 06, 2022
హైదరాబాద్: రాగల 24-48 గంటల్లో తెలంగాణ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ప్రాజెక్ట్ లు , చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ తరుణంలో మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయని.. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించారు. ఆదివారం రోజున మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కొమురంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, హన్మకొండ, జనగామ, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు , జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మంచిర్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని.. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని గ్రామాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం నాడు నిర్మల్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కొమురంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, ములుగు , జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ ప్రావిన్స్ లలో భారీగా వర్షం
- విదేశీ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి
- గాజా పై దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- గజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- అనుమతి లేని ప్రదేశంలో ఉన్న పోలీస్ కార్ పై చర్యలు
- ఎయిర్పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- 'TANA' ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్యుల పంపిణీ
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ చేసిన టి.గవర్నర్ తమిళిసై
- నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్
- భారత్ కరోనా అప్డేట్