రాగల 24-48 గంటల్లో తెలంగాణ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- August 06, 2022
హైదరాబాద్: రాగల 24-48 గంటల్లో తెలంగాణ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ప్రాజెక్ట్ లు , చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ తరుణంలో మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయని.. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించారు. ఆదివారం రోజున మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కొమురంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, హన్మకొండ, జనగామ, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు , జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మంచిర్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని.. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని గ్రామాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం నాడు నిర్మల్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కొమురంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, ములుగు , జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- విమానయాన ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చర్యలు: GCAA
- జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం పై డ్రోన్ దాడి..ఒకరు మృతి..!!
- ఖమేనీ మరణాన్ని ధృవీకరిస్తూ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించిన ఇరాన్
- బుర్జ్ అల్ అరబ్ సమీపంలో డ్రోన్ దాడి..అదుపులోకి మంటలు..!!
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి









