ఖతార్ లో ‘బ్యాక్ టు స్కూల్’ క్యాంపెయిన్
- August 07, 2022
దోహా: ఆగస్టు 13న "విత్ ఎడ్యుకేషన్, వీ బిల్డ్ ఖతార్" అనే నినాదంతో "బ్యాక్ టు స్కూల్" ప్రచారాన్ని విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది. ఈ క్యాంపెయిన్ ఆగస్టు 20 వరకు కొనసాగుతుంది. దోహా ఫెస్టివల్ సిటీ మద్దతు, రవాణా సంస్థ "కర్వా" సహకారంతో.. 2022-2023 విద్యా సంవత్సరానికి అన్ని కిండర్ గార్టెన్, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ సాగనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువుల కోసం విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలలో "బ్యాక్ టు స్కూల్" క్యాంపెయిన్ ఒకటని పేర్కొంది. విద్యార్థులు పాఠశాలకు తిరిగి వచ్చేందుకు మానసికంగా సిద్ధం చేయడం ఈ క్యాంపెయిన్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..