ఖతార్ 2022 ఫిఫా ప్రపంచ కప్.. టిక్కెట్లను గెలుచుకోండిలా
- August 08, 2022
దోహా: ప్రపంచ కప్ 2022కి 100 రోజుల కౌంట్డౌన్లో భాగంగా.. సుప్రీమ్ కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ (SC) అభిమానులకు అల్ బైట్ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్కు టిక్కెట్లను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోంది. ఖతార్లోని అభిమానులు ఆగస్టు 11-13 వరకు జరిగే వేడుకల్లో పాల్గొనవచ్చని, దీని కోసం అల్ బైట్ స్టేడియంలో జరిగే ప్రారంభ మ్యాచ్(ఖతార్ vs ఈక్వెడార్)కు కేటగిరీ 1 టిక్కెట్లను గెలుచుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొంది. దేశంలోని వివిధ మాల్స్లో వేడుకలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఇందులో సరదా ఆటలు, ప్రదర్శనలు ఉంటాయని, అదే సమయంలో అభిమానులకు వారి ఫుట్బాల్ నైపుణ్యాలను పరీక్షించే అవకాశం కూడా ఉందని పేర్కొంది. దోహా ఫెస్టివల్ సిటీలో ఆగస్టు 11-13 నుండి మధ్యాహ్నం 1 నుండి రాత్రి 10 గంటల వరకు, ప్లేస్ వెండోమ్ అదే రోజులలో మధ్యాహ్నం నుండి రాత్రి 10 గంటల వరకు వేడుకలు ఉంటాయని తెలిపింది. మాల్ ఆఫ్ ఖతార్ లో ఆగస్టు 12, 13 తేదీలలో మధ్యాహ్నం నుండి రాత్రి 10 గంటల వరకు వేడుకలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. వేడుకల్లో చివరి రోజున 100 డేస్ టు గో గ్రాండ్ ఫినాలే ఉంటుందని పేర్కొంది. #100DaysToGo అనే హ్యాష్ట్యాగ్తో ఫోటోలు తీసి సోషల్కి అప్లోడ్ చేయడం ద్వారా వేడుకలు జరుపుకోవాలని అభిమానులను సుప్రీమ్ కమిటీ కోరింది. ఖతార్ నివాసితులకు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!







