ఖతార్ 2022 ఫిఫా ప్రపంచ కప్.. టిక్కెట్లను గెలుచుకోండిలా
- August 08, 2022
దోహా: ప్రపంచ కప్ 2022కి 100 రోజుల కౌంట్డౌన్లో భాగంగా.. సుప్రీమ్ కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ (SC) అభిమానులకు అల్ బైట్ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్కు టిక్కెట్లను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోంది. ఖతార్లోని అభిమానులు ఆగస్టు 11-13 వరకు జరిగే వేడుకల్లో పాల్గొనవచ్చని, దీని కోసం అల్ బైట్ స్టేడియంలో జరిగే ప్రారంభ మ్యాచ్(ఖతార్ vs ఈక్వెడార్)కు కేటగిరీ 1 టిక్కెట్లను గెలుచుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొంది. దేశంలోని వివిధ మాల్స్లో వేడుకలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఇందులో సరదా ఆటలు, ప్రదర్శనలు ఉంటాయని, అదే సమయంలో అభిమానులకు వారి ఫుట్బాల్ నైపుణ్యాలను పరీక్షించే అవకాశం కూడా ఉందని పేర్కొంది. దోహా ఫెస్టివల్ సిటీలో ఆగస్టు 11-13 నుండి మధ్యాహ్నం 1 నుండి రాత్రి 10 గంటల వరకు, ప్లేస్ వెండోమ్ అదే రోజులలో మధ్యాహ్నం నుండి రాత్రి 10 గంటల వరకు వేడుకలు ఉంటాయని తెలిపింది. మాల్ ఆఫ్ ఖతార్ లో ఆగస్టు 12, 13 తేదీలలో మధ్యాహ్నం నుండి రాత్రి 10 గంటల వరకు వేడుకలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. వేడుకల్లో చివరి రోజున 100 డేస్ టు గో గ్రాండ్ ఫినాలే ఉంటుందని పేర్కొంది. #100DaysToGo అనే హ్యాష్ట్యాగ్తో ఫోటోలు తీసి సోషల్కి అప్లోడ్ చేయడం ద్వారా వేడుకలు జరుపుకోవాలని అభిమానులను సుప్రీమ్ కమిటీ కోరింది. ఖతార్ నివాసితులకు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







