దోహా వీధుల్లో మరో 40 కళాఖండాలు
- August 10, 2022
దోహా: ఖతార్ క్రియేట్స్లో భాగంగా ఖతార్లోని సాంస్కృతిక కార్యక్రమాల వైవిధ్యాన్ని తెలియజేసేలా దోహా వీధుల్లో మరో 40 కళాఖండాలను ఏర్పాటు చేయనున్నట్లు ఖతార్ మ్యూజియం ప్రకటించింది. ఇందుకోసం అంతర్జాతీయ కళాకారులు దోహా, ఇతర ప్రాంతాల్లో తమ కళాఖండాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొంది. ఖతారీ ఎడారి నుండి సందడిగా ఉండే సౌక్ వాకిఫ్ వరకు రాబోయే రోజుల్లో 100 కంటే ఎక్కువ పబ్లిక్ ఆర్ట్వర్క్లను ఏర్పాటు చేయనున్నట్లు ఖతార్ మ్యూజియమ్స్ చైర్పర్సన్ హెచ్ ఇ షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ తెలిపారు. పార్కులు, షాపింగ్ ప్రాంతాలు, విద్యా, అథ్లెటిక్ సౌకర్యాలు, హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, క్యూ-రైల్ స్టేషన్లు, అలాగే ప్రపంచ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే స్టేడియాలతో సహా బాటసారులను ఆకట్టుకునేలా.. ఆహ్లాదపరిచేలా పబ్లిక్ స్పేస్లలో అంతర్జాతీయ ప్రసిద్ధ కళాకారులు రూపొందించిన కళాఖండాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







