గల్ఫ్ కార్మికుల అలాయ్ బలయ్ పోస్టర్ విడుదల
- August 10, 2022
కరీంనగర్: బహుజన రాజ్యం లో గల్ఫ్ గోసలు ఉండవని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు.ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రం లో తెలంగాణ చౌక్ లో గల్ఫ్ కార్మికుల అలాయ్ బలయ్ పోస్టర్ (గోడ పత్రిక ) పార్టీ నాయకులతో కలిసి విడుదల చేసారు.తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు అయితే గల్ఫ్ కి వలసలు ఉండవని అన్న ప్రభుత్వ మాటలు నీటి మూటలు అయ్యాయని అన్నారు.ఈ నెల 14 న దుబాయ్ లో బహుజన గల్ఫ్ కార్మికుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగే అలాయ్ బలయ్ భహిరంగ సభ కి బీ ఎస్ పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథి గా హాజరు అవుతున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులు అందరు ఆదివారం 14 న దుబాయ్ లో డలస్కొ సమావేశ స్థలంలో అల్కొస్ లో జరుగుతున్న సభ ను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.ఈ గోడ పత్రిక విడుదల కార్యక్రమం లో జిల్లా ఇంచార్జ్ లు మాతంగి అశోక్, నల్లాల రాజేందర్, జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్,కరీంనగర్ జోన్ మహిళ కన్వీనర్ జన్ను స్వరూప,జిల్లా మహిళ కన్వినర్ జమున, ఉపాధ్యక్షలు శీలం రాజయ్య, జిల్లా కార్యదర్శి లు అడ్వకేట్ మంద రవీందర్, కొంకటి శేఖర్, సంగుపట్ల మల్లేష్ ,అసెంబ్లీ అధ్యక్షులు మంకాళి తిరుపతి, ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్ మహిళ, స్వప్న, కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షులు గాలి అనిల్, శ్యామ్, మండల కన్వీనర్ ఆరెపల్లి వినోద్, కళ్లేపల్లి తిరుపతి ,శేఖర్, మహేంద్ర మనోహర్ ,ప్రవీణ్ ,టౌన్ అధ్యక్షుడు అస్టపురం మధు,చందు,తదితరులు పాల్గొన్నారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







