నేడు ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగదీప్ ధన్ఖర్
- August 11, 2022
న్యూఢిల్లీ: భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం ఉదయం 11:45కి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఈ కార్యక్రమానికి ముందు ఆయన రాజ్ఘాట్లో ఉన్న మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు.
అక్కడ జగదీప్ ధన్ఖర్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడుతారు. ఆయన రాజ్యసభ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. ఈ నెల 6న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే తరఫున పోటీ చేసిన జగదీప్ ధన్ఖర్ భారీ మెజారిటితో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 528 ఓట్లతో, 74.36 శాతం శాతం ఓట్లు సాధించారు. జగదీప్ ధన్ఖర్ రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలోని ఒక గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చదివిన ఆయన కొన్నేళ్లపాటు రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.
అనంతరం 1989లో లోక్సభ ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ నుంచి ఝుంఝును ఎంపీగా గెలిచారు. తర్వాత 1990లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1993లో అజ్మీర్ జిల్లాలోని కిషన్గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019-2022 జులై 17 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







