కాంగో జైలు పై తీవ్రవాదుల దాడి..
- August 11, 2022
కాంగో: రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బుటెంబోలో ఉన్న జైలుపై కొంత మంది దాడి చేసి సుమారు 800 మంది ఖైదీలను విడుదల చేసినట్లు స్థానిక అధికారులు బుధవారం వెల్లడించారు. కట్టుదిట్టమైన ఆయుధాలతో వచ్చిన దుండగులు ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపుకు చెందిన వారని కాంగో అధికారులు చెబుతున్నారు. కాగా, తీవ్రవాదలు చేసిన ఈ దాడిలో ఒద్దరు పోలీసులు ఒక పౌరుడు మరణించారు. అర్థరాత్రి జైలుకు చేరుకున్న పదుల సంఖ్యలోని మిలిటెంట్లు.. కాల్పులు జరుపుతూ జైలుకు నిప్పు పెట్టారు.
‘‘శత్రువులు చాలా ఆయుధ సామాగ్రితో వచ్చారు. వాళ్లు సుమారుగా 80 మంది ఉంటారు. వారు జైలు గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అనంతరం ఖైదీలందరినీ విడుదల చేశారు’’ అని మలుషాయి అనే అధికారి తెలిపారు. అయితే సదరు జైలు డైరెక్టర్ బ్రునెల్లె నకాసా ఈ ఘటనపై కాస్త నాన్చుతూ సమాధానం ఇచ్చారు. మొత్తం 874 మంది ఖైదీలు ఉంటే కేవలం 58 మంది మాత్రమే జైలు నుంచి వెళ్లిపోయారని అన్నారు. కానీ వాస్తవ లెక్కల ప్రకారం.. జైలులో ఉన్న ఖైదీలంతా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
కాంగోలో ఇలాంటి ఘటనలు జరగడం సాధారణమే. అలైడ్ డమొక్రటిక్ ఫోర్సెస్ అనే తీవ్రవాద సంస్థ 2020లో బెనిలోని ఒక జైలుపై దాడి చేసి 1,300 మంది ఖైదీలను విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం జరిగిన ఘటన కూడా ఏడీఎఫ్ పనేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉగాండా స్థావరంగా పని చేసే ఈ సంస్థ 1990లో తూర్పు కాంగోలో మొదటిసారి ఏర్పడింది. ఇది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో కలిసి పని చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







