అక్రమ ఇ-బైక్ వినియోగదారులకు జరిమానాలు
- August 16, 2022
అబుధాబి: రాజధానిలో అనధికార ఎలక్ట్రిక్ బైక్లను నడుపుతున్న వ్యక్తులను అడ్డుకునేందుకు అబుధాబి పోలీసులు సిద్ధమయ్యారు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ITC) సహకారంతో రెండు నెలల పాటు అవగాహన క్యాంపెయిన్ లను నిర్వహించింది. అక్రమ వాహనాలను నడిపే వారికి అధికారులు జరిమానాలు విధిస్తున్నట్లు చూపించే వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోలీసులు షేర్ చేశారు. నిలబడి నడపబడే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు జూన్లో ITC ప్రకటించిన విషయం తెలిసిందే. సీట్లు ఉన్న స్కూటర్లను నిషేధించినట్లు పేర్కొన్నారు. అబుధాబిలో సైకిల్, ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉపయోగించవచ్చని, సీట్లు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లపై నిషేధం ఉందని అబుధాబి పోలీస్ పెట్రోల్ అండ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగ్ మహ్మద్ అల్ హెమెరీ తెలిపారు. సైక్లిస్ట్లు రద్దీగా ఉండే ప్రాంతాల్లో వేగాన్ని తగ్గించాలని, నిర్దేశించిన ట్రాక్లపై మాత్రమే డ్రైవ్ చేయాలని బ్రిగ్ అల్ హెమెరి సూచించారు. అలాగే సైక్లిస్ట్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రహదారి నిబంధనలను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







