అక్రమ ఇ-బైక్ వినియోగదారులకు జరిమానాలు
- August 16, 2022
అబుధాబి: రాజధానిలో అనధికార ఎలక్ట్రిక్ బైక్లను నడుపుతున్న వ్యక్తులను అడ్డుకునేందుకు అబుధాబి పోలీసులు సిద్ధమయ్యారు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ITC) సహకారంతో రెండు నెలల పాటు అవగాహన క్యాంపెయిన్ లను నిర్వహించింది. అక్రమ వాహనాలను నడిపే వారికి అధికారులు జరిమానాలు విధిస్తున్నట్లు చూపించే వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోలీసులు షేర్ చేశారు. నిలబడి నడపబడే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు జూన్లో ITC ప్రకటించిన విషయం తెలిసిందే. సీట్లు ఉన్న స్కూటర్లను నిషేధించినట్లు పేర్కొన్నారు. అబుధాబిలో సైకిల్, ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉపయోగించవచ్చని, సీట్లు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లపై నిషేధం ఉందని అబుధాబి పోలీస్ పెట్రోల్ అండ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగ్ మహ్మద్ అల్ హెమెరీ తెలిపారు. సైక్లిస్ట్లు రద్దీగా ఉండే ప్రాంతాల్లో వేగాన్ని తగ్గించాలని, నిర్దేశించిన ట్రాక్లపై మాత్రమే డ్రైవ్ చేయాలని బ్రిగ్ అల్ హెమెరి సూచించారు. అలాగే సైక్లిస్ట్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రహదారి నిబంధనలను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!







